Sunday, May 22, 2011

'' మిస్టర్ రావును పిలవండి '' * ఆరుగురు ప్రధానుల మాట అది

శ్రీశ్రీ, వివేకానంద, చిన్మయానంద.. ఒకరు కమ్యూనిస్టు. మరొకరు తాత్వికుడు. ఇంకొకరు ఆధ్యాత్మికవేత్త. ఈ ముగ్గురి భావజాలం వేసిన బీజంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన న్యాయమూర్తి డాక్టర్ పి.సి.రావు (పాటిబండ్ల చంద్రశేఖరరావు). కృష్ణా జిల్లా వీరులపాడులో పుట్టి పెరిగిన ఆయన హ్యాంబర్గ్‌లోని 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ' కోర్టుకు జడ్జిగా పనిచేస్తున్నారు. దేశాల మధ్య తలెత్తే తగువుల్ని పరిష్కరించే తీర్పులిస్తున్నారు. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నవ్యతో మాట్లాడారు. "రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, దేవెగౌడతో కలిపి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది. కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా.. సలహాలు కావాలన్నా "మిస్టర్ రావును పిలవండి'' అనేవారు ప్రధానులంతా. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పీవీగారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు. రాజ్యాంగంలోని ప్రొవిజన్స్‌ను చాలా సందర్భాల్లో రాజీవ్‌కు వివరించేవాణ్ణి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ యాక్ట్‌లు తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం.''
"ఫిజీలో గొడవలు జరిగినపుడు రహస్యంగా వెళ్లి అక్కడున్న భారతీయులందరినీ కలిశాను. వాళ్ల అవసరాలు, కావాల్సిన హక్కుల గురించి తెలుసుకున్నాను. వాటన్నిటినీ క్రోడీకరించి.. ఆ దేశ ప్రభుత్వానికి మన డిమాండ్లను చెప్పాను. దాంతో కొత్త రాజ్యాంగ రచనలో మన వాళ్ల హక్కులకు స్థానం దొరికింది. కొత్త రాజ్యాంగాలు రాసుకుంటున్న అన్ని దేశాలకు వెళ్లాను నేను. అలా వెళ్లి ప్రవాస భారతీయుల హక్కులకు స్థానం కల్పించమని కోరాను. కొన్ని దేశాలకు ప్రభుత్వం పంపితే, మరి కొన్నింటికి ఆ దేశాల ఆహ్వానంపై వెళ్లాను. టిబెట్, సూడాన్, కరీబియన్ దేశాలకు ఇలాంటి పనిమీదే వెళ్లడం మరిచిపోలేని అనుభవం.''

"చూశారుగా ఈ మూలనున్న పెద్ద పార్శిల్ బాక్సులు. వాటిలో ఉన్న కాగితాలను క్షుణ్ణంగా చదవాలి. బోలెడు పుస్తకాలను రెఫర్ చేయాలి. అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి. ఎవరి వాదనలో ఎంత సత్యముందో అర్థం చేసుకోవాలి. ఇది మూడు దేశాలకు సంబంధించిన వ్యవహారం కదా.. హ్యాంబర్గ్ వెళుతూనే ఈ కేసు మీద తీర్పు చెప్పాలి..'' అంటూ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ఎదురుగ్గా ఉన్న భవంతిలో ఇంటర్వ్యూ మొదలుపెట్టారు డాక్టర్ పి.సి.రావు. ఇండియా, బంగ్లాదేశ్, బర్మా దేశాల సముద్ర జలాలకు సంబంధించిన కేసు అది. ఆ మూడు దేశాలు హ్యాంబర్గ్‌లోని 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ'లో విడివిగా కేసులు వేశాయి. ఆ కేసును విచారించే జడ్జిలలో ఒకరైన డాక్టర్ పి.సి.రావు.. మన దేశంలో ఆ స్థాయికి చేరుకున్న వారిలో నాలుగోవారు. ఇంటర్నేషనల్ కోర్టుకు చీఫ్ జస్టిస్ అయిన వారిలో ప్రథములు.

రెడ్‌విలేజ్...

"కృష్ణా జిల్లాలోనే మంచి చైతన్యవంతమైన గ్రామం మాది. వీరులపాడు పేరు చెప్పగానే ఎంతోమంది పెద్దవాళ్లు గుర్తుకొస్తారు. త్రిపురనేని రామస్వామి చౌదరి మా ఊర్లోనే పెళ్లి చేసుకున్నారు. ఆనాడే రైతుల కోసం ప్రత్యేకించి గ్రంథాలయం స్థాపించారు. ఊర్లో అందరూ కమ్యూనిస్టులే. అందుకే 'రెడ్ విలేజ్' అనేవారంతా దాన్ని. మా అమ్మ పుస్తకాలు బాగా చదివేది. లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి నన్ను కూడా చదవమనేది. అలా అలవాటైన పుస్తకాలను ఇప్పటికీ వదల్లేదు నేను. పెద్దయ్యాక బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లి చదివేవాణ్ణి. అప్పుడే శ్రీశ్రీ, చిన్మయానంద, వివేకానందల భావజాలం నన్ను ఉత్తేజపరిచింది. శ్రీశ్రీ పుస్తకాలతోనే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాను. ఉపనిషత్తుల్లోని గురు, శిష్య సంవాదం తార్కిక, లౌకిక జ్ఞానాన్ని పెంచింది. చెబితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, శ్రీశ్రీ, వివేకానంద, చిన్మయానంద ఆలోచనల్లోని టెక్నిక్‌ను... నా తీర్పుల్లో కూడా అనుసరిస్తాను. టెక్నిక్ అంటే 'నువ్వు ఎటువైపు చూస్తున్నావ్..? ప్రపంచాన్ని నువ్వు ఏ దృక్పథంతో పరిశీలిస్తున్నావ్? అన్నదే''

గోల్డ్‌మెడలిస్ట్...

"వందమందిలో కేవలం పదిమందే ఎం.ఎల్.లో పాసయ్యేవారు పాత రోజుల్లో 'లా' గోల్డ్‌మెడల్ వచ్చింది నాకు. ఆ తర్వాత మద్రాసు యూనివర్శిటీలో ఎల్.ఎల్.డి. (డాక్టర్ ఆఫ్ లాస్) చేశాను. ఆ కోర్సు చేసిన ఆఖరి వ్యక్తిని నేనే. ఎందుకంటే నాకు డాక్టరేట్ వచ్చాక ఆ కోర్సును ఎత్తివేశారు. చదువు గురించి చెబుతున్నాను కాబట్టి ఇక్కడో విషయం గుర్తుచేసుకోవాలి. నేను బీఏలో ఫిలాసఫీ తీసుకుంటుంటే ఒక అధ్యాపకుడు ఏమన్నాడంటే.. "ఏంటయ్యా, ఇది పనికొచ్చే కోర్సు కాదు. ఏదైనా ఉద్యోగం వచ్చే కోర్సులో జాయినవ్వు. టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటావ్..?'' అన్నారు కాస్త విసుగ్గా. "లేదు సార్, నా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఫిలాసఫీ చేశాక న్యాయశాస్త్రం చదువుతాను...'' అన్నాను. ఫిలాసఫీ అనేది ప్రశ్నల్ని లేవనెత్తే గొప్ప శాస్త్రం. ప్రశ్నలతోనే మనో వికాసం సాధ్యం. అలా ఇష్టంతో చదవడంతో 'బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్' అవార్డు దక్కింది నాకు. చదువు పూర్తయ్యాక న్యాయరంగంలోకి అడుగులు పడ్డాయి..''

ఒక్కో మెట్టు ఎక్కుతూ..

"నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 'ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా' నెలకొల్పారు. ఢిల్లీకి వెళ్లి అందులో 'రీసెర్చ్ ఆఫీసర్'గా జాయినవ్వడంతో నా కెరీర్ మొదలైంది. అదే సంస్థ నుంచి వచ్చే 'ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా' లో ఎడిటింగ్ వర్క్ కూడా చేసేవాణ్ణి. 1967లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 'లా ఆఫీసర్'గా పోస్టింగ్ రావడంతో జాయినయ్యాను. ఆ శాఖలో పలు పదవులు నిర్వర్తించాక.. కేంద్ర న్యాయ శాఖకు వెళ్లాను. అక్కడ డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి లా సెక్రటరీ వరకు పనిచేశాను. ఈ సమయంలో రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, దేవెగౌడతో కలిపి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది.

కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా.. సలహాలు కావాలన్నా "మిస్టర్ రావును పిలవండి'' అనేవారు ప్రధానులంతా. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పీవీగారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు. రాజ్యాంగంలోని ప్రొవిజన్స్‌ను చాలా సందర్భాల్లో రాజీవ్‌కు వివరించేవాణ్ణి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ యాక్ట్‌లు తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం. విధుల్లో భాగంగా అన్ని దేశాలు తిరిగాను. అక్కడి న్యాయవ్యవస్థలను అర్థం చేసుకున్నాను. నేను అంతర్జాతీయ న్యాయరంగంలోకి వెళితే మన దేశం ప్రతిష్ట పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం... ఇంటర్నేషనల్ కోర్టుకు ప్రపోజ్ చేసింది..''

ఎల్లలు దాటి...

"అంతర్జాతీయ న్యాయవ్యవస్థ ఒకప్పుడు చాలా సంక్లిష్టంగా ఉండేది. ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి తగువులు వచ్చినా ఈ కోర్టే పరిష్కరించాలి. కేసులు పెరిగిపోయి తీర్పుల్లో జాప్యం జరుగుతుండటంతో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని విడదీశారు. అవే మూడు అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టులు అయ్యాయి. అందులో ఒకటి 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ'. ఈ కోర్టు జర్మనీలోని హ్యాంబర్గ్‌లో ఉంది. దేశాల మధ్య ఎలాంటి జల వివాదాలు వచ్చినా ఈ కోర్టే విచారిస్తుంది. ఇందులో పలు దేశాలకు చెందిన 21 మంది జడ్జిలు ఉంటారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే అదో పెద్ద ప్రక్రియ.

ఆయా దేశాలలో లబ్దప్రతిష్టులైన ఒక న్యాయనిపుణున్ని స్వయంగా ప్రధానే సిఫారసు చేయాలి. ఆ వ్యక్తి వివరాలన్నీ ఆ దేశపు రాయబార కార్యాలయాలకు వెళతాయి. న్యూయార్క్‌లోని డిప్లమాటిక్ మిషన్స్ ప్రచారం చేస్తాయి. ఈ పని అన్ని దేశాలు చేస్తాయి. ఆఖర్న ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో దేశాలు సిఫారసు చేసిన న్యాయ నిపుణులు జడ్జిలుగా పోటీ చేస్తున్న వారికి ఓటు వేస్తారు. అప్పుడు గెలిచిన వారే సంబంధిత కోర్టుకు జడ్జి అవుతారు. కనీసం 106 దేశాలు ఓటు వేస్తేకానీ జడ్జి కాలేరు. ఎన్నికైన జడ్జిలు తిరిగి చీఫ్ జస్టిస్‌ను ఎన్నుకుంటారు. ఇంత తతంగం ఉంటుంది అంతర్జాతీయ కోర్టులకు జడ్జి కావాలంటే. ఇప్పటి వరకు మన దేశం తరఫున కేవలం ముగ్గురు మాత్రమే జడ్జిలు (బి.ఎన్.రావు, నాగేంద్రసింగ్, ఆర్.ఎస్.పాథక్) అయ్యారు. నాలుగో వ్యక్తిని నేను. హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకోవడంతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిపోతుంటాను.''

-మల్లెంపూటి ఆదినారాయణ ఫోటోలు : ఎం.గోపికృష్ణ

Wednesday, May 18, 2011

శృంగారానికి తొలి పాఠం!

'కామసూత్ర' ఈ పేరు వినగానే శృంగారం గుర్తుకొస్తుంది. 
నిజానికి రెండు వేల ఏళ్ల క్రితం రాసిన ఈ పుస్తకంలో శృంగారానికి సంబంధించిన అంశాలు మాత్రమే కాదు. స్త్రీ, పురుషులు ఒకరినొకరు ఎలా ఆకర్షించుకోవాలనే విషయాన్ని కూడా వాత్స్యాయనుడు చర్చిస్తాడు. ఇప్పటి దాకా ఈ పుస్తకాన్ని భిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ.. అందులో సారాన్ని వివరిస్తూ 183 పుస్తకాలు వెలువడ్డాయి. 
http://www.thehindu.com/multimedia/dynamic/00494/03ndmpSpring_fever__494512e.jpg
కొత్తగా ఈ పుస్తకంలోని సారాన్ని అందరికి అర్థమయ్యే రూపంలో - ఎ.ఎన్.డి. హక్సర్ సంస్కృతం నుంచి ఇంగ్లీషులోకి అనువదించారు. మొత్తం ఏడు అధ్యాయాలు ఉన్న ఈ పుస్తకంలో కేవలం శృంగార భంగిమల గురించే కాకుండా స్త్రీ,పురుష సంబంధాల గురించే కూడా చర్చించారు. దీనిలోని కొన్ని ముఖ్యమైన అంశాలు.....
http://images.bhaskar.com/web2images/www.dailybhaskar.com/2011/02/21/images/kama_sutra_250_f.jpg
"ఆరోగ్యకరమైన శృంగారానికి 64 కళల అవసరం కూడా ఉంటుంది. అందువల్ల దీనిని '64 సిద్ధాంతం' అని కూడా పిలుస్తారు. రుగ్వేదంలో ఉన్న శ్లోకాలను పదింటి చొప్పున గుదిగుచ్చుతారు. అదే విధంగా శృంగార కలయికలో ఉన్న అంశాలను 64గా కూరుస్తారని మనం భావించవచ్చు. భభృవ్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం- శృంగారంలో ప్రధానమైనవి ఎనిమిది అంశాలు.''
http://ww.spicezee.com/upload/2011/1/30/kamasutra-150.jpg
పురుషులు ఎలా తయారుకావాలి?
ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పళ్లను శుభ్రంగా తోముకోవాలి. ఆ తర్వాత సువాసన వెదజల్లే లేహ్యాన్ని వంటికి రాసుకోవాలి. సుగంధాన్ని వెదజల్లే సాంబ్రాణి పొగతో జుట్టును శుభ్రపరచుకోవాలి. తేనెటీగల మైనాన్ని, మృదువుగా ఉన్న ఎర్రని లక్కను మొహానికి రాసుకోవాలి. ఆ తర్వాత మంచి పూల దండ వేసుకొని రోజు వారీ కార్యక్రమాలకు ఉపక్రమించాలి.
http://www.newsreporter.in/wp-content/uploads/2011/05/Kama-Sutra-Wall-Carvings-Khajuraho-300x225.jpg
పురుషులు ప్రతి రోజూ స్నానం చేయాలి. రెండు రోజులకు ఒకసారి ఒళ్లు పట్టించుకోవాలి. మూడు రోజులకు ఒక సారి చేప ఎముకతో చేసిన పరికరంతో ఒళ్లును శుభ్రపరచుకోవాలి. మీసాలు, గోళ్లు నాలుగు రోజులకు ఒక సారి తీసుకోవాలి. శరీరంపై ఉన్న అనవసరపు రోమాలను ప్రతి పది రోజులకు ఒక సారి తీసివేయాలి.
http://www.indianetzone.com/photos_gallery/12/khajuraho_18221.jpg
ఆకర్షణీయంగా మారాలంటే...
"తయారయ్యే విధానం, వయస్సు, వ్యక్తిత్వం, స్వేచ్ఛగా ఉండే తత్వం- ఒక వ్యక్తిని ఆకర్షణీయంగా తయారుచేస్తాయి. దీని కోసం అధర్వణ వేదంలో కొన్ని మూలికలను పేర్కొన్నారు. వీటిని ఉపయోగించటం వల్ల వ్యక్తులు ఇతరులను ఆకర్షించగలుగుతారు. అడవుల్లో పెరిగే అల్లం, గడ్డి గులాబీలు, నేరేడు జాతికి చెందిన చెట్ల ఆకులను బాగా ఎండపెట్టాలి. ఎండిన ఈ మూడింటిని పొడిగా చేయాలి. మెలోబాలన్ (ఉత్తర భారతంలో వీటిని అర్జున చెట్లు అంటారు) చెట్ల నుంచి తీసిన నూనెను ఒక మానవ కపాలంలో పోయాలి. ఈ పొడిని పత్తితో కలిపి వత్తిగా చేసి వెలిగించాలి. అప్పుడు వచ్చే పొగ గదిలోని వ్యక్తులను ఆకర్షణీయంగా చేస్తుంది. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే- మరి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కొన్ని ఎర్ర కలువలను, నీలం కలువలను తీసుకోవాలి. వీటిని అడవి గులాబీల రేకలతో కలిపి ఎండపెట్టి

పొడిగా చేయాలి. ఈ పొడిని తేనె, నెయ్యిలతో కలిపి తీసుకుంటే వ్యక్తులు ఆకర్షణీయంగా తయారవుతారు. ఈ పొడినే నేరేడు ఆకులతో కలిపి లేహ్యంగా చేసి ఒంటికి రాసుకుంటే ఆకర్షణ వస్తుంది.
http://www.telugupedia.com/VatsayanaKamaSutra/Mukteswar_temple.jpg
ఈ మూలికలతో పాటు కొన్ని జంతువుల ఎముకలను ఉపయోగించటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. బంతిపువ్వుల రేకలను తీసుకొని వాటి నుంచి రసం తీయాలి. ఈ రసంలో ఒంటె ఎముకను నానపెట్టాలి. ఇలా నానపెట్టిన ఎముకను బాగా కాల్చాలి. అప్పుడు వచ్చే కాటుకను తీసుకొని కళ్లకు పెట్టుకుంటే అత్యంత ఆకర్షణీయంగా తయారవుతారు. గద్దలు, రాబందులు, నెమళ్ల ఎముకలను కూడా ఇదే విధంగా చేసి వచ్చిన కాటుకను పెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

లైంగిక శక్తి పెరగాలంటే..
లైంగిక శక్తి పెరగటానికి, భాగస్వామిని సంతృప్తిపరచటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అల్లం, మిరియాలు, అడవిలో దొరికే లైకోరైస్ అనే చెట్టు బెరడులను పొడి చేయాలి. ఈ పొడిని పాలలో కలుపుకు తాగాలి. గొర్రె వృషణాలను పాలలో వేసి, ఆ పాలను మరగపెట్టి తాగటం వల్ల లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. మాంసం తినని శాకాహారులకు మరొక పద్ధతి ఉంది. అడవిలో దొరికే కంద, చేమ, పెండలం వంటి దుంపమొక్కల వేర్లు , ఖర్జూరాలు, గుర్రం కళ్ల ఆకారంలో ఉండే బీన్స్‌లను పాలలో వేసి బాగా మరగించి తాగినా లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. ఒక వేళ ఈ వస్తువులు దొరకకపోతే- తోక మిరియాలు, చెరకు వేర్లు, పెండలం గుజ్జును పాలలో వేసి మరగించాలి. ఆ పాలను తాగటం వల్ల ప్రయోజనం లభిస్తుంది. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారి కోసం మరి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. పిచ్చుకల గుడ్లలో ఉండే సొనను సంపాదించాలి. ఈ సొనను నేతితోను, తేనెతోను కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బియ్యం కలిపి పాలలో ఉడికించాలి. దీనిని తినటం వల్ల పురుషులలో లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. అనేక మంది స్త్రీలను సంతృప్తి పరిచే సామర్థ్యం లభిస్తుంది.

శృంగార కలయిక..
రతిలో 64 భాగాలు ఉంటాయని చెబుతారు. కొందరు అయితే 64 భాగాలను విడి విడి అధ్యాయాలుగా గ్రంథస్థం చేసారు కూడా. ఆరోగ్యకరమైన శృంగారానికి 64 కళల అవసరం కూడా ఉంటుంది. అందువల్ల దీనిని '64 సిద్ధాంతం' అని కూడా పిలుస్తారు. రుగ్వేదంలో ఉన్న శ్లోకాలను పదింటి చొప్పున గుదిగుచ్చుతారు.
http://static.ibnlive.com/pix/sitepix/02_2011/kamasutra_book_630.jpg
అదే విధంగా శృంగార కలయికలో ఉన్న అంశాలను 64గా కూరుస్తారని మనం భావించవచ్చు. భభృవ్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం- శృంగారంలో ప్రధానమైనవి ఎనిమిది అంశాలు. కౌగిలింత, ముద్దు, కిలికించితం, కొరకటం, రతి, మూలుగు, ఉపరతి, ముఖరతి. ఈ ఎనిమిదింటిలోను మళ్లీ ఎనిమిది రకాలు ఉన్నాయి. ఎనిమిదిని ఎనిమిదితో హెచ్చువేస్తే 64 అవుతుంది కాబట్టి.. శృంగార కలయికను కూడా 64 కళలుగా పిలుస్తారు.

Tuesday, May 17, 2011

ఐడియాలతో అద్భుతాలు

'' పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బు ''  ఆ పద్ధతి రాచమార్గం కాగా కుయుక్తులతో, అన్యాయంతో, అక్రమాలతో దేశాన్ని కొల్లగొట్టడం, అక్రమార్జన చేయటం అడ్డదారులుగాను. నాలుగు కాలాలపాటు నిలిచేదిగాను కాదని  తెలుసుకున్నాం. పదండి ముందుకి.. మిగతా అందిరి లాగే మనం కూడా మొబైల్ సంగీతం ఆస్వాదిద్దాం. మొబైల్ సంగీతం... జేబులో మొబైల్, చెవిలో స్పీకర్ లేని వ్యక్తి నేడు మనకెక్కెడా తారసపడరు. నడుస్తూ, వాహనాలు నడుపుతూ, నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ, నిద్రపోతూ, చదువుకుంటూ, మాట్లాడుతూ సర్వవేళ సర్వావస్తలా ఈ మొబైల్ సంగీతం ఉండాల్సిందే... దాదాపు అందరికీ.. దీని పూర్వాపరాలు తెలుసుకుందాం.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOq4Sn_UmgdFYJQobMXVhW58urKO3fmE4miz5RPNkvqXJAjkc4hSWTR-O7b_VvQEqrV13tNMr3A-n65phQxCX_fpYXs1PbjX-w7JrIn8GLif1i0srWyFYHhLs6JMihwm0wlfLlgFSabjQ/s1600/Akio+Mirota.jpg
ఈ మొబైల్ సంగీత యుగం ఆరంభం కాకముందు ప్రయాణాలు ముఖ్యంగా గంటలతరబడి చేసేవి, చాలా కష్టతరంగా, బోరింగ్ గాను ఉండేవి. ఒక్కసారిగా ఊహించుకోండి. దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగా సాగే భారత్-అమెరికా విమాన యాత్రలో సీట్లకు అతుక్కుపోయి అలాగే ఉండిపోవటం ఎంత కష్టంగా ఉండేదో ! తనువు, మనసు రెండు కష్టపడేవి విసుగెత్తిపోయేవి. అలాంటి ఒక ప్రయాణంలో సోనీ కార్పొరేషన్ చైర్మన్ అకియో మోరిటా బ్రహ్మాండంగా బోర్ అయిపోయి ఒక సరికొత్త ఐడియాతో ప్లేన్ దిగాడు. ఆ ఐడియా మ్యూజిక్ పరిశ్రమను పూర్తిగా మార్చివేయటమే కాకుండా, మనం సంగీతం వినే పద్ధతులను కూడా గుర్తుపట్టలేనంతగా మార్చేసింది. ఆ సుదీర్ఘ విమానయానం తర్వాత జపాన్‌లోని తన ఆఫీసుకు వెళ్లిన మోరిటా తన బృందాన్ని పిలిచి అటువంటి సుదీర్ఘ విమానయానాల్లో మనం మనకిష్టమైన మ్యూజిక్ వింటుంటే ఎంత బాగుండునో కదా అని అన్నాడు. ఆ ఆలోచనే నేడు కొన్ని వేల కోట్ల విలువైన ' వెళ్తూ వినే సంగీతానికి '(మ్యూజిక్ ఆన్ ది మూవ్) నాంది పలికింది.http://www.conceivablytech.com/wp-content/uploads/2010/10/sony-walkman.jpg
ఈ ఆలోచనకు మొదటి ప్రత్యక్ష రూపమే సోనీ వాక్‌మెన్. యువతను సంపూర్ణంగా ఆకట్టుకొని వాక్‌మెన్ లేని జీవితం కూడా ఒక జీవితమేనా అనేలా చేసింది. వాక్‌మెన్ మన వెంట తీసుకెళ్లగలిగిన మొట్టమొదటి మ్యూజిక్ సిస్టమ్. ఈ సిస్టమ్ వృద్ధి చెంది స్టీరియో రికార్డింగ్ చేసుకునే సదుపాయాన్ని కలిగించింది. కంప్యూటర్ మ్యూజిక్, ఎంపి 3 వచ్చిందాకా ఏకచ్ఛత్రాధిపత్యంతో మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలింది వాక్‌మెన్. వాక్‌మెన్‌ను సృష్టించిన మోరిటాకు ఆ పేరంటే అస్సలు ఇష్టముండేది కాదు. వాక్‌మెన్ ఏమిటి అసహ్యంగా అనుకున్నాడు. పేరు మార్చుదామని ప్రయత్నిస్తే సలహాదారులు చాలా పాపులర్ అయిన పేరు వాక్‌మెన్ మార్చవద్దని సలహా ఇచ్చారు. వాక్‌మెన్ పేరు అలాగే ఉండిపోయింది.

ఒక చిన్న ఐడియా దూరాభారపు విమాన ప్రయాణాల్లో సొంత సంగీతం వినటం ఎలాగా అన్న ఆలోచన సంగీత ప్రపంచంలో సంచలనం కలిగించి, వేల కోట్ల వ్యాపారానికి మూలకారణమైంది. డబ్బు సంపాదించాలంటే ఐడియాలు కావాలి. అడ్డదార్లు కాదు మహాప్రభో !! వెళ్తూ ... తింటూ... తింటూ వెళ్తూ... రెండు బ్రెడ్ ముక్కలు.. వాటి మధ్య ఒక బర్గర్.. మరో చిన్న ఐడియా వేల కోట్ల వ్యాపారానికి, లాభాలకు నాంది పలికింది. అంతేకాదు నాగరిక జీవనానికి ఒక గుర్తుగా మారింది. అనగనగా ఒకప్పుడు కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఇద్దరు సోదరులు డిక్, మేక్ మెక్ డొనాల్డ్‌లకు ఒక ఆలోచన కలిగింది. ప్రయాణంలో ఉన్నప్పుడు సాధారణంగా రెండు భోజనాల మధ్య ఆకలవుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో ఏదో ఒక సామాన్యమైంది, సింపుల్‌గా ఉంటే చాలు. నక్షత్రాల హోటళ్ల విందులవసరం లేదు. వేడిగా, తాజాగా, రుచిగా, తొందరగా లభ్యమయ్యే ఆహారమైతే చాలు. కార్లోను, బస్సులోను ప్రయాణం చేస్తుంటే వాహనం దిగకుండా ఆ ఆహారం దొరికితే అది బోనస్ కింద లెక్క. అప్పుడు ఆ ఆహారం కోసం కస్టమర్లు పదేపదే వస్తారు... ఇదీ ఆ సోదరులు ఆలోచన.
http://www.index.hr/images2/McDWend1.jpg
బ్రహ్మాండమైన ఆలోచన ఈ ఆలోచనలోంచి ఉద్భవించిందే.. ప్రపంచంలోని అతి పెద్ద ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్. గ్రాండ్‌గా ఐదు నక్షత్రాల రెస్టారెంట్స్ కావివి.. సింపుల్‌గా, క్లీన్ గా, ఫాస్ట్‌గా మన ఆకలిని తీర్చే ఆహారం అమ్మే రెస్టారెంట్స్. మెక్‌డొనాల్డ్స్ కథ కూడా వాళ్లు అందించే ఆహారం లాగానే చాలా సింపుల్. ఈ అన్నదమ్ములతో చేయి కలిపాడు రేక్రాక్ అనే ఓ పెద్ద మనిషి. తర్వాత ఆయనే ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసి నేడు మనం చూస్తున్న మెక్‌డొనాల్డ్స్‌గా తీర్చిదిద్దాడు. మెక్‌డొనాల్డ్స్ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న రెస్టారెంట్ చైన్. ఎన్నో చోట్ల, ఎల్ల వేళలా ఒకే రకంగా ఉండే సామర్థ్యం, ఆహారం.. ఇవీ మెక్‌డొనాల్డ్స్ విజయానికి మూల కారణాలు. ప్రపంచంలోని ఏ భాగనున్నా, మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఒకే రూపంలో ఉంటాయి. వెంటనే క్షణంలో ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. లోపలికెళ్లగానే ఒక రకమైన ఫుడ్, అదే సామర్థ్యం అన్ని చోట్ల ఒకేలా.http://www.thegimcrackmiscellany.com/wp-content/uploads/2008/09/whopper.jpg

కొత్త దేశాల్లో, కొత్త మనుషులు మధ్య ఒంటరితనం కాకుండా మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్‌ను ఒక చిరపరిచితమైన స్నేహితుడిగా భావిస్తాం మనం. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్యలో ఓ బర్గర్... చిన్న ఐడియా... వేల కోట్లలో వ్యాపారం, లాభాలు. నేడు 119 దేశాల్లో 31 వేల పైచిలుకు మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రోజుకి 4 కోట్ల 7 లక్షల మంది పైనే కస్టమర్లు. ఇదండీ కథ.

ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం
http://gigaom.files.wordpress.com/2008/09/kilby1lg.jpg
కిల్బీ, నోయిస్ అనే ఇద్దరు సైంటిస్టులు మైక్రోచిప్‌ను కనుగొని ఒక కొత్త ప్రపంచానికి శ్రీకారం చుట్టారు. మనం నేడు నివసిస్తున్న ఈ అధునాతన ప్రపంచంలోని కొత్త ఆవిష్కరణలో కెల్లా ఎంతో ముఖ్యమైంది ఈ మైక్రోచిప్ ఆవిష్కరణ. ఈ ఇద్దరు సైంటిస్టులు వేర్వేరుగా దీన్ని కనుగొని కొన్నేళ్లు కీచులాడుకొని చివ్వరికి మైక్రో చిప్ ఆవిష్కరణ తమ సమిష్టి కృషిగా నిర్ధారించుకొన్నారు. మైక్రోచిప్ ఎంత చిన్నదంటే దాన్ని ఒక చిరు చీమ నెత్తినపెట్టుకొని మోసుకెళ్లగలదు. అటువంటి అతి సూక్ష్మమైన చిప్ మీద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని పొందుపరుస్తారు. ప్రతి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌కి సర్క్యూట్ ప్రాణంలాంటింది. ఆ ప్రాణం ఉంది ఈ చిన్న ఇసుక రేణువులో !! ఆశ్చర్యంగా ఉంది కదూ ! ఈ ప్రక్రియ ద్వారా ఒక గది నిండా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మన అరచేతిలో సులభంగా అమరే ఒక బుల్లి డివైస్‌లో కూర్చోపెట్టవచ్చు.

మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ అని అంటూ ఉంటామే. దీని అవతరణకి మూల కారణం ఈ సిలికాన్ మైక్రోచిప్ వల్లనే. ఈ చిప్‌ను దీని వాడకంతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అమ్మకాలు 2004లో 179 అమెరికన్ బిలియన్ డాలర్లని అంచనా. అంటే 8 లక్షల కోట్ల రూపాయలకు పైబడే. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆధారంగా అమ్ముడుబోతున్న ఎలక్ట్రానిక్ పరికరాల విలువ 1.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే 50 లక్షల కోట్ల రూపాయలను మించి. ఈ అంచనాలు టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ వారివి. ఇక్కడే కిల్బీ పనిచేశాడు. కిర్బీ కథనం ప్రకారం ఒక సమస్యను తొందరగా పరిష్కరించాలనే ప్రయత్నంలో ఉన్నాడతను.

ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని అతడు కనుగొని ఉండకపోతే, ఆయన కంపెనీ ఆయన్ను ఒక సమస్యాపూరితమైన పనిలోకి మార్చి ఉండేది. అది ఎలాగైనా తప్పించుకోవాలని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి సారించాడు. వేసవి కాలం సెలవులు కావటం వల్ల తను పనిచేసే టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో తన సహోద్యోగులందరూ సమ్మర్ హాలిడేస్ మీద వెళ్లారు. ఆయనొక్కడే ఉన్నాడు పనిలో. టిఆర్ రీడ్ అనే వ్యక్తి రాసిన పుస్తకం 'ది చిప్'లో ఇలా అంటాడు కిల్బీ.. నేను తొందరగా ఒక మంచి ఐడియాను కనుగొన లేకపోతే వేసవి సెలవుల తర్వాత నన్ను మైక్రో మాడ్యుల్ డిపార్ట్‌మెంట్‌లోకి మారుస్తారేమోననిపించింది. అది ఇష్టం లేదు కిల్బీకి .అందుకే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి కేంద్రీకరించాడు.
http://www.biographicon.com/images/Noyce_Robert.jpg
మరోపక్కన నోయిస్ తన పరిశోధనల ద్వారా మైక్రో చిప్‌ని తక్కువ ధరల్లో పెద్ద ఎత్తున (మాస్ మాన్యుఫ్యాక్చర్) తయారు చేసే పద్దతిని కనుగొన్నాడు. అంతేకాదు ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్ సంస్థలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తుండగా చిప్‌ని కనుగొన్నాడు. కాలిఫోర్నియాలోని సిలికాన్ నేవీలో ఉన్న మొట్టమొదటి విజయవంతమైన సిలికాన్ సంస్థ ఈ ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్. వాళ్ల ప్రేరణలు ఎటువంటివైనప్పటికీ ఈ ఇద్దరు సైంటిస్టులు.. కిల్బీ, నోయిస్ మనందరి జీవిత విధానాన్ని మార్చివేసిన మైక్రోచిప్‌ని కనుగొన్నారు. ప్రతి ఆవిష్కరణకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కటి మటుకు ఉండదు.. డబ్బు.. ఒక ఆవిష్కరణ ఫలించటం ద్వారా దాని ఉప ఉత్పాదనగా, బై ప్రొడక్టుగా ప్రతిఫలంగా డబ్బు వస్తుంది తప్పితే కేవలం డబ్బు కోసం నూతన విధానాల ఆవిష్కరణ ఎక్కడా జరగలేదు. ఎవ్వరూ చేయలేదు.
- ఎజి కృష్ణమూర్తి

Friday, March 11, 2011

జననం..మరణం

కబీరు గొప్ప వేదాంతి. ఆయన తత్త్వం హిందూ-ముస్లింల మధ్య సామరస్యానికి పతాక. కవిత్వం, తత్త్వం ఆయనకు ప్రాణప్రదం. ఆడంబరం వద్దన్నాడు. విగ్రహారాధన అసలే తగదన్నాడు. 15వ శతాబ్దంలో సంస్కరణ వాదాన్ని తన కవితల ద్వారా ప్రపంచానికి అందించాడు. సరళమైన కబీరు మార్గాన్ని ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది వరకు అనుసరిస్తున్నారు. ఆయన తాత్వ్తిక ధార ఇది.
దార్శనికుడు కబీర్
హిందువులు, ముస్లింల మధ్య గొప్ప సామరస్య భావాన్ని నెలకొల్పడంలో అగ్రగణ్యుడు సంత్ కబీర్ అన్నారు ప్రముఖ చరిత్రకారుడు ఆర్. సి. మజుందార్. మహనీయుల పుట్టుక గురించి అడగకూడదంటారు పెద్దలు. అలానే 1440 - 1518 సంవత్సరాల మధ్యకాలంలో జీవించినట్లు భావిస్తున్న సంత్ కబీర్ పుట్టుపూర్వోత్తరాలు కూడా కడువిచిత్రం. ఎక్కడో పుట్టిన కబీర్‌ను వారణాసిలోని చేనేత కుటుంబానికి చెందిన దంపతులు పెంచి పెద్ద చేశారు. వారణాసిలో పెరగడంతో హిందూతత్త్వం గంగాతరంగాల్లా ఆయన సొంతమయ్యాయి. మరోవైపు జన్మతః వచ్చిన సూఫీతత్వం ఆయనకు మరింత వన్నె తెచ్చింది. బట్టల వ్యాపారిగా, చేనేత నిపుణుడిగా, గొప్ప తత్త్వవేత్తగా, కవిగా కబీర్ బహుముఖ ప్రజ్ఞ చూపారు.

పూజలు, పునస్కారాల సంస్కృతిని తన కవితల్లో ఎండకట్టారు కబీర్. తాత్త్విక చింతనతో, ఆడంబరాలు లేని జీవన విధానాలే భగవంతుడిని చేరుకొనే నిజమైన మార్గాలని బోధించారు కబీర్. విలక్షణమైన ఆయన బోధనలు ఎంతో మందిని ఆకర్షించాయి. కబీర్ మార్గ అనుయాయులు సిక్కు మతస్థులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోటిమంది వరకు ఉన్నారంటే సరళమైన ఆయన తత్త్వం ఎందరిని ఆకర్షించిందో అర్థం అవుతుంది. కవిత, భజన, సంస్కృత పద్యాల ద్వారా వేదాంతాన్ని సరళంగా ప్రజలకు అందించారు కబీర్. పలు భాషల్లో ఆయన భజనలు నే టికీ భక్తుల హృదయరాగాలై పలుకుతున్నాయి. ఆయన తాత్త్విక కవితలు అనేకం ఖవ్వాలీ పాటల రూపంలో నేటికీ పాకిస్తానీ గాయకుల గళాల నుంచి జాలువారుతూనే ఉన్నాయి.

హిందూ, ఇస్లాం వేదాంత మార్గాలను సమర్థిస్తూనే వాటిలో ఉన్న దురాచారాలను ఆయన ఎండకట్టారు. విగ్రహపూజల్ని, వ్యక్తి ఆరాధనల్ని వ్యతిరేకించారు. రెండు మతాల మధ్య వేదాంత వారధిగానే కాకుండా గొప్ప తాత్వికుడిగా, కవిగా, నిరాడంబర వాదిగా, సంస్కరణా శీలమైన దార్శనికుడిగా సంత్ కబీర్ చిరస్మరణీయుడు.

'ఎంతవరకు శరీరంలో ఊపిరి ఉంటుందో అంతవరకు అన్నీ కుశలమే. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిలిచిపోతాయో, అప్పుడు భార్యకూడా అతనిని చూసి భయపడుతుంది' అన్నారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో.

బతుకు ఓ మాయ

ఇదే తత్త్వాన్ని సంత్ కబీరు తన భక్తునికి ఒక ప్రయోగం ద్వారా ఆత్మావగతం ఆయ్యేలా చేశారు. కబీరుకు ఓ భక్తుడు ఉండేవాడు. ధనవంతుడు. కొందరు సంతానం. ఎందరో మిత్రులుండేవారతనికి. సమాజంలో గౌరవ మర్యాదలుండేవి. ఆ భక్తునికి బతుకుమీద అంతులేని ప్రీతి. ఒకరోజు కబీరు అతనితో మాట్లాడుతూ 'ప్రాపంచికమైన ఈ బంధాలన్నీ ఈ దేహం దానికి సంబంధించిన వస్తువులున్నంత వరకే.

అందుకే బతుకు ఒక మాయ' అన్నారు. భక్తుడు క బీరు మాటలకు సమ్మతించలేదు. ' మీరు చేప్పేది సరికాదు... నా భార్య సంగతి తీసుకుందాం. మా దాంపత్య జీవితం నలభయ్యేళ్లు. ఎంతో ప్రేమానురాగాలతో జీవిస్తున్నాం. ఒకవేళ నేను మరణిస్తే వెంటనే ఆమె గుండె పగిలి చస్తుంది' అన్నాడు శిష్యుడు చాలా విశ్వాసంతో. ఇక నా మిత్రులు నాకోసం ప్రాణాలైనా ఇస్తారు. నా పిల్లలు నేను లేకుండా జీవించరు' అన్నాడు.

చస్తే ఏమవుతుందో చూద్దాం!

కబీరు నవ్వుతూ, 'అలాగైతే నీవు చస్తే ఏమవుతుందో చూద్దాం. నీకొక ఔషధం ఇస్తాను. దాన్ని తిన్న తరువాత ఒక గంటలోగా నీ దేహం బిగుసుకుపోతుంది. చూసేవారికి నీవు చనిపోయినట్లే ఉంటుంది. కాని నీ బుద్ధి శక్తి యథాతథంగా ఉంటుంది. అన్నీ తెలుసుకుంటావు. నీ భార్య, పిల్లలు, మిత్రులు, బంధువులు నీ వియోగాన్ని ఏ రీతిగా భావిస్తారో చూద్దాం' అన్నాడు. భక్తుడు సమ్మతించాడు.

గురు, శిష్యుల పథకం ప్రకారం భక్తుడు ఔషధం మింగాడు. గంటలోగా భక్తుడు నిశ్చలుడైనాడు. దేహం బిగుసుకుపోయింది. ఇంట్లో కోలాహలం ప్రారంభమైంది. భార్య, పిల్లలు భోరుమని ఏడవసాగారు. ఆ వార్త దావానలంలా వ్యాపించింది. మిత్రులు పరుగు తీస్తూ వచ్చారు.

మధ్యంతరంగా పోయారే...!

భార్య దుఃఖంతో పొర్లాడుతూ భర్త దేహంపై పడి రోదిస్తూ ఉంది. "తల నిండా పూలు పెట్టుకొని, వంటి నిండా నగలను ధరించి, పట్టుచీర కట్టుకొని పేరంటాలకు వెళ్లినప్పుడు నన్ను చూసిన వారందరూ మహాలక్ష్మి వచ్చినట్లుంది అనేవారు. ఇప్పుడు మీరు చస్తే నా గతేం కాను? విధవగా సమాజంలో ఎలా ఉండగలను? పోయేవారు మరో పదేళ్ల తర్వాత పోకూడదా? సుఖంగా జీవించడానికి కావలసిన వసతులు సమకూర్చి మధ్యంతరంలో పోయారే!'' అని రోదించింది భార్య.

కొడుకులు గుసగుసలు ప్రారంభించారు. "చచ్చేముందు ఇనప్పెట్టె తాళం గుత్తులు ఎక్కడున్నదీ చెప్పకనే పోయాడు. అడిగిన మిత్రులందరికీ అప్పులిచ్చాడు. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో! ఆ పత్రాలెక్కడ దాచాడో!'' అంతా వింటున్నాడు నిశ్చలదేహుడైన శిష్యుడు. మిత్రులు తమలో తాము చర్చించుకోవడం భక్తుని చెవిలో పడింది.

"కావలసినప్పుడు డబ్బులిచ్చి ఆదుకునేవాడు. ఆకస్మికంగా చనిపోయాడే. బంగారు గుడ్లు పెట్టే కోడి చచ్చిపోయింది''. వ్యాపారంలో పోటీ పడుతున్నవారు "పీడ విరగడ అయింది. హాయిగా ఉండవచ్చు''.... ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీరున మాట్లాడటం వింటూనే ఉన్నాడా కబీరు భక్తుడు. అదరూ తమకు కలిగిన నష్టాన్ని గురించి బాధపడుతుండగా కబీర్ ఆ వ్యవహారాన్నంతా ఒక మూల కూర్చుని నాటకంలా తిలకిస్తున్నాడు.

భర్త... దేహం... భయం

ఈ లోగా సూర్యాస్తమయం అయింది. ఇరుగుపొరుగువారు ఆకలితో బాధపడుతున్నారు. భార్య కన్నీరు కారుస్తూ "చీకటి పడేలోగా అంత్యక్రియలు జరగాలి. పోయినవారు మరలిరారు కదా''. అంది. భక్తుడు నిజంగానే నిశ్చేష్టుడయ్యాడు.

కబీరు నవ్వుతూ భక్తునితో అన్నాడు. 'తెలిసిందా బంధుమిత్రులు, భార్యాపిల్లల తీరు చూశావు కదా. అర్ధాంగి అని భావించిన భార్య శవంతో ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నది. తక్కినవారు ఇక ఏ తీరుగా స్పందిస్తారో చెప్పేదేముంది... అంటూ చేష్టలుడి గిన శిష్యుడిని అనునయించారు సంత్ కబీర్. అంతటి గొప్ప సత్యాన్ని సులభగ్రాహ్యంగా అనుభవంలోకి తీసుకురావడం ఆ మహనీయుడైన కబీరుకే చెల్లింది.

కన్ను మూస్తే మరణం

మరణం ఒక మిథ్య. దేనిని భౌతిక దేహంతో అనుభవించలేమో దాన్ని మిథ్య అంటున్నాం. ఒక వ్యక్తి మరణించాడంటే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్తబ్దం అవుతాయి. నేటి వైద్యులు గుండె ఆగింది. మెదడు మొద్దుబారింది. వ్యక్తి మరణించాడని ప్రకటిస్తారు.

మరణించిన తరువాత అందులోని చైతన్యం ఏమవుతుంది. అనుభవించి చెప్పగలవారెవరు? ఆధునిక కవి అన్నట్లు, "కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం. రెప్పపాటే గదా జీవన ప్రయాణం. ఊపిరి పోయిన తరువాత మరల ఊపిరి ఆడకపోవడమే మరణం''. ఇదంతా సత్యమే. మిథ్యాజీవితంలో మన కర్తవ్యం ఏమిటి? అంటే 'అల్పమైన విరామ కాలంలో జీవితం యొక్క భౌతికతను, పారమార్థికాన్ని తెలుసుకోవడమే వివేకం' అన్నారు శంకరులు.

- జానమద్ది హనుమచ్ఛాస్త్రి

Saturday, February 19, 2011

అపజయాల దారులలోనే గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఓటముల పుటలతో పుస్తకం బరువెక్కుతుందనుకుంటే విజయకావ్యం తేలికయిపోతుంది కదా! సుఖం విలువ తెలియాలంటే కష్టం బాధా తెలియాల్సిందే. కన్నీటి వ్యధని ఆలకించగలిగితేనే ఆనంద బాష్ప కథ మిగిలేది. ఓటమి రుచి తెలియనిదే గెలుపు విలువ తెలిసి రాదు. విజయగాథలన్నీ గుణపాఠాలు నేర్పుతాయని కాదు. నిజానికి అపజయం నేర్పే పాఠాలే గుణపాఠాలవుతాయి.
కళ కళ కోసమే అన్నట్టుగా గెలుపు కూడా గెలుపు కోసమే! అలా గెలుపు నుంచి గెలుపునకు చేసే ప్రయాణమే జీవితం. అది నిరంతరం. ఆ నిరంతరతలో చైతన్యం ఉంటుంది. సాధన ఉంటుంది. ఆ సాధనలో అభ్యాసం ఉంటుంది. శిక్షణా ఉంటుంది. ఇంతటి పరిశ్రమకు కారణం గాడి తప్పకుండా ఉండటం కోసమే. ఎదురు దెబ్బలు తగలకుండా ఉండటం కోసమే. అసలు శిక్షణ అనేది ఒకరు ఇచ్చేది అయినా కావచ్చు లేదా తనకు తానుగా తయారుకావటం అయినా కావచ్చు. ఇక్కడ తనకు తాను అంటే స్వశిక్షణ అనే. దీన్నే సెల్ఫ్ ట్రెయినింగ్ అంటుంటాం. అంటే నాకు నేనుగా ఒక సృజన మార్గంలో శిక్షణకు ఉపక్రమించడం. గెలుపులోని తృప్తి తాత్కాలికం అని తెలుసు కాబట్టే మరిన్ని గెలుపుల కోసం ఇటువంటి శిక్షణ, సాధన అవసరమవుతుంటుంది. నిజానికి శిక్షణ అనేది గెలుపు దాహానికి ప్రతీక. అంతేకాదు విజయ తృష్ణ, కీర్తికాంక్షల ప్రతిబింబం కూడా!

విరామం లేనిదే విజయం
ఒక గెలుపును చవిచూసి విజయతీరాన్ని చేరాననుకోవటం అపజయానికి మొదటిమెట్టవుతుంది. అది తీర ప్రాంతం లేని చైతన్య స్రవంతి. గెలుపునకు ఆరంభమే తప్ప ముగింపు ఉండదు. అంటే విజయగాధలకు ముగింపు వాక్యాలుండవు. అనుభవాలు సక్సెస్ మంత్రాలవుతాయే తప్ప అవే విజయానికి నిర్వచనాలు కాలేవు. విజయాన్ని చరిత్రపుటలకు ఎక్కించాలనుకున్నప్పుడు అపజయాల పుటలూ ఉంటాయని మరచిపోకూడదు. మనకు కనిపించేవి వెలుతురు సీమలే కావచ్చు... కనిపించని చీకటి కోణాలను చూడగలగటమే సక్సెస్ సీక్రసీ. ఓటముల పుటలతో పుస్తకం బరువెక్కుతుందనుకుంటే విజయకావ్యం తేలికయిపోతుంది కదా! సుఖం విలువ తెలియాలంటే కష్టం బాధా తెలియాల్సిందే. కన్నీటి వ్యధని ఆలకించగలిగితేనే ఆనంద బాష్ప కథ మిగిలేది. ఓటమి రుచి తెలియనిదే గెలుపు విలువ తెలిసి రాదు.

విజయగాథలన్నీ గుణపాఠాలు నేర్పుతాయని కాదు. నిజానికి అపజయం నేర్పే పాఠాలే గుణపాఠాలవుతాయి. చలిజ్వరం మనిషిని ఎంతలా వొణికిస్తుందో అపజయమూ అంతలా పట్టి కుదిపేస్తుంది. ఇది తెలిసిన వారికి ఓటములూ రుచికరంగానే ఉంటుంటాయి. విజయం వరించాలంటే సాధన, శిక్షణ బలపడాల్సిందే. అప్పుడే విజయపం«థాలో సృజనశీలత చోటు చేసుకుంటుంది. లేకపోతే మూసపోకడల విజయగాథలు బోర్ కొట్టిస్తాయి. అందుకే విజయం రక్తి కట్టాలంటే సాధన, శిక్షణ శక్తిమంతం కావాలి.

ఓటమి ఆటంకం కాదు
ఓటములన్నీ విజయానికి ఆటంకాలనుకోవటం పొరపాటు. ఓడినంత మాత్రాన తలదించుకోవాల్సిన పనిలేదు. నా ఓటమికి ఇతరులు కారణమని తలపోస్తే నిజంగానే నేను తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లే. అలా ఇతరులను మన ఓటమికి కర్తలను చేస్తున్నామంటే మనం ఓడిపోతున్నట్లే. విజయానికి నేను కర్తను...అపజయానికి పరులు కర్తలు అనటంలోనే మన సంకుచితత్వం బయటపడుతుంటుంది. నిజానికి ఓడిపోవటం ఓటమి కాదు.

ఆ ఓటమికి పరులను కర్తలను చేయటమే అసలైన ఓటమి. అన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని ఈ సందర్భంలో మనం అన్వయించుకోగలిగితే అపజయాలన్నీ మేఘాలలా వర్షాన్నో, గాలివాననో సృష్టించవు. అవి అస్తమయ ఆకాశానికి రంగులద్దుతాయి. ఇక్కడ అస్తమించటం అనేది సూరీడే తప్ప ఆకాశం కాదు. పైగా అస్తమయం మరో ఉషోదయానికి తెరలేపుతుంది. అంటే అపజయం విజయానికి భూమిక అవుతోంది. ఓటమి గెలుపుకు మార్గదర్శి అవుతున్నట్లే. ఈ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే విజయపథం ఆనందమార్గమే అవుతుంది. అప్పుడు ఆనందానికి హద్దులు ఉండనట్లే విజయానికీ ఎల్లలు ఉండవు.

సమ ఆదరణ ముఖ్యం
అపజయాలు సైతం విజయసోపానాలు అవుతున్నాయంటే అన్ని అపజయాల ఇటుకలను మన జీవితం నుంచే ఏరుకొచ్చినట్లు కాదు. ఇతరుల జీవితాలలోని ఓటములూ మన కళ్లు తెరిపిస్తాయి. చేజారిన విజయం విలువను అపజయం అనుభవంతో తూయటం నేర్పిస్తాయి. ఎన్నోమార్లు పడిలేస్తేనే పరుగు నిలకడ తెలిసి వచ్చేది. ఎదురు దెబ్బలు తగలనిదే విజయశిఖరం అందిరాదు. జారిన ప్రతిసారీ పురోగమనంపై పట్టు కలుగుతుంది.

ఆ ఆరోహణలో జారిపడ్డ సందర్భాలన్నీ విజయ సంకేతాలే. జారిన ప్రతిసారీ ఓడినట్లు కాదు. జారినంత మాత్రాన అవమానం దరిచేరినట్టుకాదు. తలదించుకోవలసిన అవసరం లేదు. జారిన ప్రతిసారీ తల ఎత్తి పట్టుదలగా ఆరోహించాలి. పట్టుపట్టరాదు... పట్టి విడువరాదు. అంటే ఇదే! సంకల్పిస్తే సాధించాల్సిందే. సాధించటం అంటే విజయాన్ని వరించటమే.

ఇలా విజయాన్ని చవి చూడాలంటే అన్ని ఓటములు మన జీవితంలోనే చోటు చేసుకోవాలని కాదు. అందరి అనుభవాలను సమంగా ఆదరించగలిగితే అవే మనకు గెలుపు పాఠాలు నేర్పుతాయి. విజయపథానికి మైలురాళ్లవుతాయి. విజయపథంలో మైలు రాళ్లను లెక్కించాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. 'మన లక్ష్యం ఏమిటి? మన గమ్మం ఏది?' అని గెలుపుకూ గెలుపుకూ మధ్య అయినా సరే, గెలుపు ఓటముల మధ్య అయినా సరే. ఇలా ప్రశ్నించుకోక తప్పదు. ఈ ప్రశ్నే సమాధానాన్ని అందిస్తుంది. సాధననూ నేర్పుతుంది, స్వశిక్షితుల్నీ చేస్తుంది.

- డా. వాసిలి వసంతకుమార్
యోగాలయ రీసెర్చ్ సెంటర్
ఫోన్ : 9393933946

Saturday, November 27, 2010

ఎందుకున్నామిక్కడ?

ఒక జూలో... ఒక తల్లి ఒంటె, ఒక పిల్ల ఒంటె రెండూ సేదతీరుతున్నాయి. ఉన్నట్టుండి పిల్ల ఒంటెకు ఒక సందేహం రావడంతో.... 'అమ్మా..మన పొట్టలో నీటి తిత్తి ఎందుకు ఉంటుంది?' అని అడిగింది తల్లిని.
'మనం ఎడారి జంతువులం కదా... నెలలు నెలలు నీళ్లు దొరక్కపోయినా బతకడానికి మన పొట్టలో నీటిని దాచుకుందుకు దేవుడు నీటి తిత్తిని ఏర్పాటు చేశాడు' అని సమాధానమిచ్చింది తల్లి.
'మరి మన కాళ్లు పొడుగ్గా....పాదాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి?' ఇంకో సందేహాన్ని లేవనెత్తింది పిల్ల ఒంటె. ' ఇసుకలో నడిచేందుకు వీలుగా అలా ఉన్నాయి. మన కాళ్లు, పాదాలు ఇలా ఉండడం వల్లే ఇతర జంతువుల కన్నా చురుగ్గా, హాయిగా ఎడారిలో తిరగ్గలం మనం' గర్వంగా చెప్పింది తల్లి.
'మరి మన కంటి రెప్పల వెంట్రుకలెందుకు పొడుగ్గా ఉంటాయి చూపుకి అడ్డం పడేలా?' బుంగమూతితో ప్రశ్నించింది పిల్ల ఒంటె.
'పిచ్చి తల్లి.... కంటిరెప్పల వెంట్రుకలు అలా పొడుగ్గా ఉండబట్టే ఎడారిలో వీచే గాలికి ఇసుక మన కంట్లో పడకుండా రక్షణ ఉంటుంది' అనునయంగా వివరించింది తల్లి ఒంటె.
'ఓహో.. ఎడారిలో ఉండడానికి దేవుడు మన శరీరంలో ఇన్ని ఏర్పాట్లు చేస్తే... మరి మనం ఈ జూలో ఎందుకున్నామమ్మా....?' అమాయకంగా అడిగింది పిల్ల ఒంటె.

***

ఇవ్వాళ ఎందరికో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మనుషులుగా మనం నేర్వాల్సిందేమిటి, నేర్చుకున్నదేమిటి, చేయాల్సిందేమిటి, చేస్తున్నదేమిటి, మనుషులుగానే స్థానభ్రంశం చెందుతున్నామా....
పిల్ల ఒంటెకున్న పాటి తెలివి కూడా మనకు లేకుండా పోతోందే!

నాన్నకో లేఖ

ఏదో పని మీద కొడుకు గదిలోకి వెళ్లిన తండ్రికి స్టడీ టేబుల్ మీద కొడుకు రాసిన ఉత్తరం కనిపించింది. ఏంటా అని తీసి చదవడం మొదలుపెట్టాడు తండ్రి..


డియర్ డాడ్...
ఈ విషయాలన్నీ మీకు చెప్పాలంటే బాధగానే ఉంది. కాని చెప్పక తప్పడం లేదు. నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. రోజూ ప్రతి చిన్న విషయానికి నువ్వూ, అమ్మా పోట్లాడుకోవడాలు, అరుచుకోవడాలు.. నన్ను చాలా డిస్ట్రర్బ్ చేస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతత కరువవుతోంది. దాన్ని బయట వెదుక్కునే ఆరాటంలో ఉన్నాను. నన్ను ప్రేమగా చూసుకోవడానికి నా కన్నా పెద్దదైన ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. సరదాలు, అల్లర్లు పంచుకోవడానికి ఫ్రెండ్స్, పబ్బులు, క్లబ్బులు ఉండనే ఉన్నాయి. చదువు సంధ్యలు, భవిష్యత్ బెంగలు.. గట్రా మరిచిపోయి ఆనందంగా... గాల్లో తేలిపోవడానికి కొకైనూ అందుబాటులో ఉంది. 
వీటన్నిటినీ అనుభవిస్తూ.... 
హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను డాడీ.... .
నా కోసం వెదకొద్దు.


పిఎస్:  డాడీ.... పైన నేను రాసిన విషయాలన్నీ నా స్టడీ టేబుల్ సెంటర్ డ్రాలో ఉన్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్‌లోని మార్కులకన్నా భయంకరమైన విషయాలు. అవన్నీ అబద్దం . నేను ఎక్కడికీ వెళ్లలేదు. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. మంచి, చెడుల విచక్షణ నాకుంది. విచక్షణను అందించేదే కదా...విజ్ఞానం. మరి దీనికి మార్కులు కొలమానమా డాడీ....? ఇది అర్థం చేసుకున్నాక, మీ కోపం తగ్గాక కాల్ చేయండి. 
క్షణంలో మీ ముందుంటాను.
లవ్ యూ డాడీ....  
మీ అబ్బాయి