Tuesday, July 19, 2011

వెలుగులోంచి చీకట్లోకి ......

జర్నలిజం పట్ల ఆమెకున్న మక్కువ అతి చిన్న వయస్సులోనే ఆమెను అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. ఆ శిఖరాన తాను నిలబడి, తన పత్రికను నిలబెట్టడానికి ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పురుషాధిక్య ప్రపంచమైన జర్నలిజంలో ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా పరిస్థితులు చివరకు ఆమెను కూలబడేలా చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యూస్‌ ఇంటర్నేషనల్‌ ఫోన్‌ టాపింగ్‌ కేసులో అరెస్టు అయ్యి బెయిల్‌పై విడుదలైన రెబెకా మేరీ బ్రూక్స్‌ కథ ఇది...
Rebekah-Brooks 
మీడియా మొగల్‌ రూపర్ట్‌ మర్డాక్‌కు నలుగురు కుమార్తెలే అయినప్పటికీ బ్రూక్స్‌ అయిదవ కుమార్తెలా వ్యవహరించేది. ఆయనకు అత్యంత సన్నిహితురాలైన బ్రూక్స్‌ను ఆయన ఈ అప్రతిష్ట నుంచి కాపాడలేకపోయారు. మర్డాక్‌ సామ్రాజ్యంలో ఎదిగిన బ్రూక్స్‌ ను ఆయన నుంచి ఎవరూ విడదీయలేరని లండన్‌ పత్రికలు పేర్కొంటూ ఉంటాయి.

బ్రూక్స్‌ అసలు పేరు రెబెకా మేరీ వేడ్‌. లాంక్‌షైర్‌లోని వారింగ్టన్‌లో 1968, మే 27న జన్మించిన బ్రూక్స్‌ డేర్స్‌బరీలో పెరిగింది. పద్నాలుగేళ్ళ వయసులోనే తాను జర్నలిస్టు కావాలని నిర్ణయించుకున్న రెబెకా వారింగ్టన్‌లోని ఆపిల్‌టన్‌ హాల్‌ కౌంటీ గ్రామర్‌ స్కూల్లో చదువుకుంది. లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌లో చదువుకున్న బ్రూక్స్‌ తన ఇరవయ్యవ ఏట నుం చే న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌లో పని చేయడం ప్రారంభించింది. ఆమె జర్నలిజానికి చేసిన సేవలకు 2010వ సంవత్సరంలో బ్రూక్స్‌ లండన్‌లోని యూ నివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఆనరరీ ఫెలోషిప్‌ను ప్రకటించింది.

హైస్కూల్‌ చదువు పూర్తి చేసిన వెంటనే పారిస్‌లో ఆమె లా ఆర్కిటెక్చర్‌ డీ అజైర్డ్‌ అనే ఫ్రెంచ్‌ పత్రికలో పని చేసింది. అనంత రం ఎడ్డీ షాకు చెందిన మెస్సెంజర్‌ గ్రూప్‌లో పని చేసింది. తర్వాత న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ సండే పత్రికలో సెక్రెటరీగా 1989లో చేరి అనంతరం ఫీచర్‌ రైటర్‌గా ఎదిగింది. టివి సీరియళ్ళ నిపుణుడు క్రిస్‌ స్టేసీతో కలిసి ‘ఎ టు జెడ్‌ ఆఫ్‌ సోప్స్‌’ అనే శీర్షి కను సండేకు పత్రికకు అందించి, అంతిమంగా పేపర్‌కు డెప్యూటీ ఎడిటర్‌గా ఎదిగింది. దాదాపు పదేళ్ళ అనంతరం ఆమె సన్‌ పత్రికకు డి ప్యూటీ ఎడిటర్‌గా బదిలీ అయింది. ఈ సమయంలోనే ఆమె పేజ్‌ త్రీ గర్ల్స్‌ శీర్షికను ఆపించేందుకు ప్రయత్నించిందని ఆరోపణలున్నాయి. రెండేళ్ళ తర్వాత అంటే 2000వ సంవత్సరంలో ఆమె న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కు ఎడిటర్‌గా నియమితురాలైంది. ఒక బ్రిటిష్‌ జాతీయ పత్రికకు అతిపిన్న వయస్సులోనే ఎడిటర్‌ అయిన గౌరవం ఆమెకు దక్కింది.

సారా పేన్‌ అనే ఎనిమిదేళ్ళ బాలిక హత్యానంతరం ‘నేమింగ్‌ అండ్‌ షేమిం గ్‌’ పేరుతో వివాదాస్పద ప్రచారానికి శ్రీకారం చు ట్టింది. ముఖ్యంగా పిల్లలపై అత్యాచారాలు చేసి శిక్షించబడ్డ వారిపై ఈ ప్రచారం నడిచింది. పత్రిక తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆగ్రహించిన ప్రజలు అనుమానించిన ప్రతివారిని తన్నేదాకా వెళ్ళడంతో దానిని ప్రారంభించినందుకు ఆమె ఎన్నో విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చిం ది. అయినప్పటికీ పత్రిక అమ్మకాలు ఆమె నేతృత్వంలో స్థిరంగా నిలబడ్డాయి. అయితే ప్రత్యర్ధి పేపర్లు ది పీపుల్‌, ది సండే మిర్రర్‌ అమ్మకాలు మాత్రం బాగా పడిపోయాయి.

rebekah 
అనంతరం 2003లో ఆమె సన్‌ పత్రిక తొలి మహిళా ఎడిటర్‌గా బాధ్యత లు స్వీకరించింది. ఈ సమయంలో ఆమె ప్రచురిం చిన కథనాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అదే సంవత్సరం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సెలెక్ట్‌ కమిటీ వ్యక్తిగత విషయాలు, ప్రైవసీకి సంబంధించి చేసిన దర్యాప్తులో తన పత్రిక సమాచారం కోసం పోలీసు అధికారులకు లంచాలు ఇచ్చినట్టు బ్రూక్స్‌ పే ర్కొంది. ఇవే ప్రస్తుత ఆరోపణలకు ఊతమయ్యాయి.
ఆమె ఆర్గనైజేషన్‌ వుమెన్‌ ఇన్‌ జర్నలిజంకు చైర్‌ పర్సన్‌గా, గార్డియన్‌ స్టూడెంట్‌ మీడియా అవార్డులకు జడ్జిగా వ్యవహరించింది. 2009లో ఆమె న్యూస్‌ ఇంటర్నేషనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమితురాలైంది.
2002వ సంవత్సరంలో నటుడు రాస్‌ కెంప్‌ను వివాహం చేసుకున్న బ్రూక్స్‌ 2009లో అతడి నుంచి విడాకులు పొంది రేస్‌ హార్స్‌ ట్రైనర్‌, రచయిత అయిన ఛార్లీ బ్రూక్స్‌ను వివాహం చేసుకున్నది.

ఫోన్‌ హాకింగ్‌ స్కాండల్‌:

న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికకు సెలబ్రిటీల మొబైల్‌ ఫోన్లకు వచ్చే మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ను వినే అలవాటు ఉన్నట్టు పోలీసు దర్యాప్తులో తేలడంతో వివాదం మొదలైంది. పత్రిక రిపోర్టర్‌ క్లైవ్‌ గుడ్‌మన్‌తో పాటు మరొకరిని 2006లో రాచకుటుంబ సభ్యులకు వచ్చిన ఫోన్‌ మెసేజ్‌లను ఇంటర్సెప్ట్‌ చేసినందుకు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పటి నుంచీ వివాదం నలుగుతున్నప్పటికీ 2011లో అది బద్దలైంది. గార్డియన్‌ పత్రిక ఫోన్‌ హ్యాకింగ్‌ ఉదంతాలపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది.

ముఖ్యంగా 2002లో బ్రూక్స్‌ పత్రిక ఎడిటర్‌గా ఉండగా కనిపించకుండా పోయి, హత్యకు గురైన మిల్లీ డౌలర్‌ అనే విద్యార్ధిని కి ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన మెసేజ్‌లను యాక్సెస్‌ చేసినట్టు గార్డియన్‌ తన కథనంలో ఆరోపణలు చేసింది. వస్తున్న మెసేజ్‌లతో ఫోన్‌ ఇన్‌బాక్స్‌ నిండిపోవడంతో కొన్నింటిని డిలీట్‌ చేసి కొత్తవాటిని విన్నారని, మెసేజ్‌లు డిలీట్‌ కావడంతో మిల్లీ తల్లిదండ్రులు ఆమె సజీవంగా ఉందని భావించారని తన కథనంలో పత్రిక పే ర్కొంది. ఈ ఉదంతంపై బ్రూక్స్‌ తాజాగా మిల్లీ తల్లిదండ్రులకు క్షమాపణ లు చెప్పుకుంది. అయినప్పటికీ ఇవేవీ ఆమెను కాపాడలేకపోయాయి.

బ్రూక్స్‌కు ఉన్న స్నేహాలు సాధారణమైనవి కావు. ఆమె టోనీ, షెరీ బ్లెయిర్‌లకే కాదు ప్రస్తుత గార్డన్‌ బ్రౌన్‌కు, డేవిడ్‌ కామరూన్‌కు స్నేహితురాలు. ఆమె నివాసం ప్రస్తుత ప్రధాని కామరూన్‌ ఇంటికి సమీపంలోనే కావడంతో ఆమె ఆయన కుటుంబంతో మరింత స్నేహంగా ఉంటుంది. రాజకీయ నాయకులతో ఆమె సాన్నిహిత్యం అనేక విమర్శలకు తావిచ్చింది. న్యూస్‌ ఇంటర్నేషనల్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ వివాదం చిలికి చిలికి గాలి వాన కావడంతో ఆమె జులై 15వ తేదీన తన పదవికి రాజీనామా చేసింది. న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికకు ఆమె ఎడిటర్‌గా ఉన్న సందర్భంలోనే ఈ హ్యాకింగ్‌ జరిగినట్టు వార్తలు రావడం, అందులో ఆమె పాత్రపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. బ్రూక్స్‌ ఉదంతం పాశ్చా త్య ప్రెస్‌లో సంచలనాన్ని రేపటమే కాదు జర్నలిజంలో నైతిక విలువల గు రించిన బ్లాగుల్లో చర్చలకు శ్రీకారం చుట్టింది. సమాజానికి నాలుగవ స్తం భమైన ప్రెస్‌ బాధ్యతలేమిటో గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.

Monday, July 18, 2011

Eagle Story - Why is Change Required

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World InformativesEagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Thank You !
 
Received this from Mr.Subrahmanyam, Hyderabad

Sunday, July 10, 2011

నిత్య 'అనుమాన్'

ఆయన పేరు బ్రహ్మానందం. యాభయ్యారేళ్లు. రెవెన్యూలో మంచి ఉద్యోగం. రిటైరయ్యే టైము కూడా దగ్గర పడుతోంది. ఉన్నట్టుండి ఒక రోజున గప్‌చుప్‌గా హైదరాబాదొచ్చి 'హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్' చేయించుకున్నాడు. కుర్రాడిలా తయారయ్యాడు. అంతే!
వాళ్ళావిడ బిత్తరపోయింది. 'ఈ వయస్సులో నీకు ఇదేం పోయే కాలం' అంటూ విరుచుకుపడిపోయింది. అనుమానంతో ఎగాదిగా చూడడం మొదలెట్టింది. ఏదో దుర్బుద్ధి లేకపోతే, ఇప్పుడు నెత్తిమీద జుట్టుతో నీకు పనేంటంటూ సాధింపు మొదలెట్టింది.
'లేదే బాబూ! మరీ రోశయ్యగారి లాగా ఉంటే, ఆఫీసులో బాగుండడం లేదం'టూ నెత్తీనోరూ కొట్టుకున్నా, వాళ్ళావిడ ఒక పట్టాన నమ్మలేదు. ఆరు నెలలు బ్రహ్మానందం మీద నిఘా పెట్టింది. అందులోంచి బయటపడడానికి చచ్చేంత పనయింది ఆయనకు. అనుమానానికి అంత పవరుంది.


మనం నిద్ర లేచింది మొదలు, తిరిగి మంచం మీదకు చేరే దాకా బతుకంతా అనుమానాలే. మనతో పాటే అనుమానం కూడా నిద్రలేస్తుంది కాబోలు. అది ఎలా...ఎందుకు పుడుతుందో కనిపెట్టిన వాడు ఇంతవరకు లేడు. కొన్ని అనుమానాలకు మన 'ఇగో' కారణమైతే కొన్ని మన జీవితానుభవంలో నుంచి పుట్టుకు వస్తాయి. మరి కొన్నిటికి మనం జీవించే పరిస్థితులు, పరిసరాలు కారణమవుతాయి. 'ప్రేమ'లాగే అనుమానానికి కూడా కారణం-నివారణ ఉండవు. పాలప్యాకెట్లు వేసేవాడు రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే మనకు డౌటు వచ్చేస్తుంది. 'వస్తాడో... రాడో? ఏ యాక్సిడెంటన్నా అయిందేమో... పాల ప్యాకెట్లలో నుంచి ఇంజెక్షన్‌తో పాలు లాగేసి నీళ్లెక్కిస్తున్నారని మొన్న పేపర్లో రాశారు. మన వెధవాయి కూడా ఆ పని చేస్తున్నాడేమో... అందుకే లేటయిందేమో..' ఇలాంటి ఆలోచనలెన్నో వచ్చేస్తాయి. పేపర్‌బాయ్ రావడం ఆలస్యమైనా అంతే. 'వాడు పేపర్ వేసి వెళ్లాక ఎదురు ఫ్లాట్‌లో వాళ్లు తీసుకున్నారో యేమో' లాంటి అనుమానాలన్నీ మన మనసుల్లో అప్పటికప్పుడే పుడతాయి.

స్కూలుకని వెళ్లిన పిల్లాడు స్కూలుకు వెళ్లాడోలేదో అని తల్లికి అనుమానం. సరుకుల కోసం బజారుకెడితే తూకంలో టోపీ వేస్తాడేమోనన్న అనుమానం. స్నానానికి వెళితే ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొడతారేమోనన్న అనుమానం. పక్కింటి పాపాయమ్మ వచ్చి మంచిగా మాట్లాడుతుంటే అప్పు అడుగుతుందేమోనన్న అనుమానం.

కూతురైనా..కొడుకైనా

కాలేజీకెళ్లే కూతురి సెల్‌ఫోన్ మోగిందంటే చాలుఅమ్మకి, నాన్నకి, అన్నకి, తమ్ముడికి.. అందరికీ అనుమానమే. ఆ అమ్మాయి కాని ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుకుంటూ వరండాలోకి అలా నడిచి వెళ్తేనో.. లేదా కొత్త నెంబర్‌నుంచి ఫోన్ వస్తేనో.. మరీ అనుమానం. 'వీడేంటి.. ఇంకా లేవలేదు. ఆఫీసు ఐదింటికే అయిపోతుందిగదా! రాత్రి ఒంటిగంటదాకా ఏం చేస్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు..' అని ప్రతి కొడుకు మీద తండ్రులకుచచ్చేంత అనుమానం. కరెక్టో కాదో తేల్చుకోవడం ఎలా... పాపం అనవసరంగా అనుమానపడుతున్నామేమో... మళ్లీ ఇదో అనుమానం.

అక్కడికీ తోడొస్తుంది

ఆఫీసుకి బయలుదేరితే... మనతో పాటే అనుమానమూ బయలుదేరుతుంది. 'ఆఫీసరు ఏం వేధిస్తాడో... ఏం పాడో... మాటమాటకూ బెల్లుకొట్టి పిలుస్తుంటాడు. ఆ ఫైలు అలా ఉందేమిటి? నీ ఇంగ్లీషు ఇలా ఉందేమిటి అంటుంటాడు. పిలిచినప్పుడల్లా మొహం అదోలా పెట్టి మాట్లాడుతుంటాడు. అసలు కారణం వేరే ఏదైనా ఉందా..' అని దిగువ ఉద్యోగుల అనుమానం. స్టాఫ్ సరిగ్గా పని చేస్తున్నారో లేదో, కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారేమోనని బాస్‌కి అనుమానం.

సిటీబస్సెక్కిన దగ్గర్నించి కిచెన్‌లో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశామో లేదో, ఇంటి తాళం సరిగ్గా వేశామో లేదో... అని ఇల్లాళ్లకు అనుమానం. బస్కెక్కి టిక్కెట్ తీసుకోవడానికి వంద కాయితమో... యాభై కాయితమో ఇస్తాం. కండక్టరు వెంటనే చిల్లరివ్వడు. టిక్కెట్టుకు వెనక పక్క కెలుకుతాడు. దిగేటప్పుడు మర్చిపోతామేమోనన్న అనుమానం. వెంటనే చిల్లరివ్వకుండా వెనక రాయడంలో కండక్టరుద్దేశం కూడా అదేనేమోనన్నది మరో డౌటు.
ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు డబ్బులు అవసరమై ఏటీఎంకి వెళ్లి డ్రా చేస్తుంటే.. వెనక నిల్చున్నాయన పిన్ నెంబర్ చూస్తున్నాడేమోనన్న అనుమానం. డబ్బులు డ్రా చేసి లెక్కపెట్టుకునేటప్పుడు ఎవరైన్నా వచ్చి లాక్కెళ్తారేమోనని మరో అనుమానం. జేబులో డబ్బుంటే చుట్టూ ఉన్నవాళ్లందరి మీద ప్రతిక్షణం అనుమానమే.

అనుమానపు ఉద్యోగాలు


కొన్ని ఉద్యోగాలైతే అసలు అనుమానం మీదే నడుస్తాయి. ఈ ఉద్యోగులకు అనుమానాలు రాకపోతే వాళ్లకు ఉద్యోగం చేయడం రానట్టే. మాట వరుసకు పోలీసున్నాడు. ఎవరు చెప్పేదాన్నయినా ఒక పట్టాన నమ్మడు. అనుమానంతో పై నుంచి కింది దాకా చూస్తాడు. ఎక్కడలేని ప్రశ్నలూ వేస్తాడు. వాటికి సమాధానాలు చెప్పేసరికి తల ప్రాణం తోకలోకి వస్తుంది. ఈలోగా మనం చెప్పేది ఆ పోలీసు నమ్ముతున్నాడో లేదోనన్న అనుమానంతో మనం చస్తుంటాం.

షాపింగ్‌మాల్లో అయినా, సినిమాహాల్ వద్దయినా.. ఎక్కడకెళ్లినా సెక్యూరిటీ అనుమానపు కళ్లు మన మీద పడకుండా ఉండవు. చివరికి మనం పనిచేసే ఆఫీసు మెట్లవద్ద మనకి సుపరిచితులైన సెక్యూరిటీ వాళ్లు కూడా మనల్ని అనుమానంగానే చూస్తారు. అవసరమనుకుంటే తనిఖీలు కూడా చేసేస్తారు. ఇకనల్ల కోటేసుకుని తీర్పులు చెప్పేవారి పరిస్థితి మరీ అన్యాయం. ఎవరు ఏది చెప్పినా వినాలి. కాని చెప్పిందంతా గుడ్డిగా నమ్మేయడానికి లేదు. నిజం తెలుసుకోవడం వారికి పాలల్లోంచి నీటిని విడదీసినంత కష్టం. ఇలాంటి 'అనుమానపు ఉద్యోగాలు' చేసే వాళ్లెందరో.

మొగుడు పెళ్లాల మధ్య అనుమానాల గురించి చెప్పాల్సి వస్తే రామాయణం కంటే పెద్ద గ్రంథమవుతుంది. రామాయణం అంటే గూర్తొచ్చింది అందులోని మెయిన్ పాయింటు అదే కదా. లేకపోతే సీత ఎందుకు అగ్ని ప్రవేశం చేయాల్సి వస్తుంది?
ఏ ఇంట్లోనూ మొగుడు పెళ్ళాన్ని నమ్మడు. తనాఫీసుకు వెళ్లిపోయాక ఆవిడ సినిమాకు చెక్కేస్తుందేమోనని డౌటు. బజారుకు వెళ్లి అక్కరలేనివన్నీ కొనేస్తుందని మరో డౌటు. అమ్మగారింటికి వెళ్లి తన మీద అయినవీ కానివీ చెప్పేస్తుందని ఇంకో డౌటు. అలాగే పెళ్ళామూ మొగుడ్ని నమ్మదు. ఆయన ఆఫీసునుంచి ఇంటికి రావడం కాస్త లేటయితే చాలు.. ఏ అమ్మడితో ఎక్కడ కాలక్షేపం చేస్తున్నాడో.. ఏ బారులో కూర్చుని మందులో మునిగిపోతున్నాడో లాంటి సవాలక్ష అనుమానాలు భార్యను నిత్యం కాలుస్తూనే ఉంటాయి.

అనుమానపు బతుకులు

ప్రతిరోజూ రోడ్డుమీద రకరకాల మనుషులు తారసపడుతుంటారు. ఎవరిలో ఏ దొంగ దాగున్నాడో, ఎక్కడొచ్చి బ్యాగో, సెల్‌ఫోనో లాక్కొని చెక్కేస్తాడో అని అనుమానం. ఎదుటి వ్యక్తి మనవైపు నవ్వుతూ చూసినా 'అదోలా చూస్తున్నాడేంటి?' అని అనుమానం. ఎలాగో పనులు ముగించుకుని కొంపకు చేరితే, 'హమ్మయ్య! ఇవాల్టికి బతికాం...' అంటూ ఓ నిట్టూర్పు విడిచి రాత్రికి కరెంటు ఉంటుందో... పోతుందోనన్న అనుమానంతో నిద్రలోకి జారుకుంటాం.

యజమానులు పనివాళ్ళను నమ్మరు.. ఎంత నమ్మకంగా పనిచేసినా సరే ఎప్పుడేది పట్టుకుపోతారేమోననుకుంటూ డౌటు పడుతూనే ఉంటారు. ఇంట్లో ఏ వస్తువు కనిపించకపోయినా యజమానుల కళ్లు ఆనుమానంగా పనమ్మాయి వైపే చూస్తాయి. నేను దొంగతనం చేయలేదు దేవుడో అని ఎంత వేడుకున్నా వారిమీద అనుమానం పోదు. అదేదో అనుమానించడం యజమానుల హక్కు అయినట్టు, వాటిని తట్టుకోవడం పనోళ్ల వృత్తిధర్మమైనట్టు ఉంటుంది.

విదేశీసంబంధాలు.. వింత అనుమానాలు

ఇక పెళ్లి సంబంధాల విషయంలో అయితే ఈ అనుమానాల పాత్ర అంతా ఇంతా కాదు. పెళ్ళిళ్ళ పేరయ్యలు చెప్పే వాటిని అటువారు గాని, ఇటువారు గాని ఒక పట్టాన నమ్మరు. అబ్బాయో... అమ్మాయో... అమెరికాలోనో, ఇంగ్లాండ్‌లోనో సలక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్నారు అని చెపితే నమ్మరే! 'అమెరాకా వెళ్లినవారు ఖాళీగా ఎందుకుంటారు? ఈ పాటికి దుకాణం తెరిచే ఉంటారు. చూస్తూ చూస్తూ వాళ్లతో ఎక్కడ వేగుతాం..?' ఈ అనుమానాలు ఒక్కొక్కసారి నిజమూ కావచ్చు. ఒక్కొక్కసారి ఉత్తివే కావచ్చు. 'అనవసరంగా అనుమానపడి మంచి సంబంధం వదులుకున్నాం' అంటూ నాలుక్కొరుక్కున్న వారు బోలెడంతమంది, 'మన అనుమానం నిజమైందిరా బాబూ బతికిపోయాం' అంటూ ఊపిరి పీల్చుకున్న వారు కూడా బోలెడంత మంది.

డాక్టర్ మీదా డౌటే

ఇలా చిన్న చిన్న విషయాలకే కాదు. ప్రాణం మీదకు వచ్చే సందర్భాలలో కూడా 'అనుమానాల'దే ప్రధానపాత్ర. ఒంట్లో బావుండకపోతే, ఆస్పత్రికి వెడదామనుకుంటే డాక్టరు 'మనోడే'నా అని అనుమానం. 'మనోడు' కాకపోతే సరిగ్గా చూడడేమోనని డౌటు. డబ్బులు గుంజడానికి అనవసరమైన పరీక్షలన్నీ రాస్తాడేమోనన్న అనుమానం. రోగం నయం కాకపోతే ఆ డాక్టరు అసలు డాక్టరు చదువు చదివాడో లేడోనని మరోసారి అనుమానం.

అనుమానం నిజమైనపుడు.. దొరికిపోయిన దొంగ ప్రవర్తన కూడా హాస్యాస్పదమవుతుంది. ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన అప్పారావు కూడా, ప్రతి పైసాకు లెక్కలున్నాయని, వాళ్ళావిడకు పుట్టింటోళ్ళు ఇచ్చినదే ఆ సొమ్మంతా అని బుకాయించడం చూస్తే నవ్వొస్తుంది. రాజకీయాల్లో అయితే ఈ అనుమానపు హాస్యానికి అంతూ పొంతూ ఉండదు. ఏ ఒక్క నాయకుడు చెప్పేదానినీ మరో నాయకుడు చచ్చినా నమ్మడు. స్వంత పార్టీ నాయకులు అసలు నమ్మరు. దాంతో, ఒకరిపై ఒకరు ప్రకటనలు. ఫలితంగా చదవడానికే చిరాకేసేంత మీడియా కాలుష్యం. చివరికి అందరూ ఒకటేనన్న తత్వం బోధపడుతుంది.

అనుమానపు రాజకీయాలు

రాజకీయాల్లో అనుమానానికి ఉన్నంత ప్రాధాన్యత మరి దేనికీ లేదేమోననిపిస్తుంది. మాటవరసకు, కె.వి.పి.రామచంద్రరావు ఇప్పటికీ వెనకనుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారేమోనని గాలి ముద్దుకృష్ణమనాయుడికి చచ్చేంత అనుమానం. బొత్స సత్యనారాయణ ఎటునుంచి నరుక్కొస్తునారోనని సి.ఎం. గారికి వీరడౌటు. ఇప్పుడే ఫ్రిజ్‌లోనుంచి తీసిన ఐస్‌క్రీమ్ లాగా నిగనిగలాడిపోతున్న జగన్ వెంట కమ్యూనిస్టులు వెళ్లిపోతారేమోనని తెలుగుదేశం వారికి డౌటు. కుర్రాడు కత్తి, చాకు, సెవన్-ఒ-క్లాక్ బ్లేడులాగున్నాడని సురవరం సుధాకరరెడ్డి, రాఘవులు స్టేట్‌మెంట్లివ్వడం ఇందుకు కారణమట. ఇక మిగిలినవన్నీ మన అనుమానాలే.
***
ఇలా బతుకంతా అనుమానాల పుట్టే. మరి అనుమానాలు లేకుండా బతకలేమా? తెలియదు. అదీ డౌటే. అనుమానాలతో బతికేదెట్టా? తెలియదు. అదీ డౌటే. ఒక్క విషయంలో మాత్రం డౌటక్కర లేదు. అనుమానం అన్నదానికి వాస్తవంతో పని లేదు. మనకు తారసపడ్డ ప్రతి మనిషినీ, ఎదుటివారు చెప్పే ప్రతి విషయాన్నీ, ప్రతి సంఘటననూ అనుమానించకపోవచ్చు కాని రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎక్కువే. చాలా సందర్భాలలో మనవి ఉత్త అనుమానాలేనని తేలిపోతుంది. పాలవాడు పాలల్లో నీళ్ళు కలపకపోవచ్చు. కూరగాయలు అమ్మేవాడి తూకం నిఖార్సుగా ఉండవచ్చు. బస్సులో కండక్టరు మనం దిగేలోపే, మనకు రావలసిన చిల్లర డబ్బులు ఇచ్చేయవచ్చు. ఇంట్లో పనిమనిషి ఏ దొంగతనమూ చేయకపోవచ్చు. డాక్టరు సరైన ట్రీట్‌మెంటే ఇచ్చి ఉండవచ్చు. ఆఫీసుల్లో బాసులు మన మేలు కోరే తిడుతుండవచ్చు. కాని అనుమానం అనుమానమే. మనల్ని స్థిమితంగా ఉండనివ్వదు. లోలోపల పీకేస్తుంటుంది. లోపల దాచుకోలేం. బయటపడి అడగలేం. అడిగితే ఏమనుకుంటారోనన్న డౌటు. 'మర్యాద'లు అడ్డొస్తాయి. అడక్కపోతే దెబ్బయి పోతాయేమోనన్న బెంగ.

ఏ విషయంలోనైనా అనుమానం మొదలైతే చాలు, మన చూపులో తేడా వస్తుంది. మాటతీరులో తేడా వస్తుంది. వ్యవహారశైలి మారిపోతుంది. ఇదంతా మొహంలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. అది చూసి మనం ఎందుకు ఇంతగా ఇదైపోతున్నామోనని ఎదుటివారు అనుమాన పడుతుంటారు. ఈ విషయాన్ని మనమూ ప్రస్తావించం. ఎదుటివారూ ప్రస్తావించరు. అంతా సైలెంట్‌గానే జరిగిపోతుంటుంది.

ఎందుకింత అనుమానం...?
నిత్య జీవనంలో 'అనుమానం' అనేది ఇంతగా తొంగి చూడడానికి బోలెడన్ని కారణాలు. జనాభా పెరిగిపోయింది. జీవనంలో వేగం పెరిగిపోయింది. ఎలాగోలా బతకాలి. బతుకే ఒక పోరాటమైపోయింది. ఆస్తులు, హోదాలతో సంబంధం లేకుండా అందరిదీ బతుకు పోరాటమే. మరో మార్గం లేదు. పైగా పుట్టిన చోట బతకడం లేదు మనమెవ్వరమూ. అంటే చిన్నప్పటినుంచి తెలిసినవాళ్ల మధ్య బతకడం లేదు. జీవితం ఎక్కడికి తీసికెళితే అక్కడికి వెళుతుంటాం. అంటే మనవాళ్లు, మన సంస్కృతి, మన భాష కనబడని, వినబడని చోట బతకాల్సొస్తుంటుంది చాలాసార్లు. ఈ పరాయితనం వల్ల కూడా అనుమానం పెనుభూతంలా మనను వెంటాడుతుంటుంది. సమాజంలో నిజాయితీ తగ్గడంతో వాతావరణ కాలుష్యం లాగానే మానసిక కాలుష్యం ఎక్కువైపోయింది. అందువల్లనే కావచ్చు, ఎదుటివారి చూపులో... మాటలో... ఆలోచనలో... నడకలో ప్రతిదీ అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. ఎవరి మీదా మనకి ఒక పట్టాన నమ్మకం కుదరదు. వారు చెప్పే మాటల్ని నమ్మబుద్ధి కాదు.

రాజుగారి పాల బిందెలో ఎవరికి వారు చెంబుడు నీళ్ళు పోసినట్టయిపోయింది జీవితం. పేపర్లు తిరగేస్తుంటే, సగం వార్తలు ఈ అనుమానం మీద జరిగిన సంఘటనలే తారసపడుతుంటాయి. అనుమానంతో పెళ్ళాన్ని చంపేసిన ప్రబుద్ధుడో... ప్రియురాలి మీద దాడి చేసిన ప్రేమికుడో... పిల్లల్ని చంపేసిన తండ్రో... పౌరుడ్ని చంపేసిన పోలీసో మనకు దర్శనం ఇస్తుంటారు.
మనిషికీ... మనిషికీ మధ్య సంబంధాలు ఇంతగా క్షీణించడానికి ఈ అపనమ్మకమే ప్రధాన కారణం అని కూడా అంటుంటారు. అభద్రతా భావం కూడా ఒక కారణమే.

అంత అనుమానం అవసరమా..?

'అనుమానం' తెచ్చే చిరాకులెన్ని ఉన్నా, దాన్ని అంత సీరియస్‌గా తీసుకోకుండా ఉంటేనే మేలు అంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఎందుకంటే, అనుమానంతో పొద్దున్నే పాలవాడితో తగాదాపడితే నష్టం ఎవరికి? కూరగాయల కొట్టోడితో యుద్ధం చేస్తే ఇబ్బంది పడేది ఎవరు? బస్సులో కండక్టరును అనుమానిస్తే రెండు కాళ్ల నడకే. అనుమానాలతో మనుషుల్ని దూరం చేసుకోవడం తగదు. కాబట్టి షుగర్ వ్యాధిలాగా అనుమానాల్ని కూడా అదుపులో... పరిమితుల్లో ఉంచుకోవడం మనకీ, ఎదుటివారికి కూడా క్షేమం. ప్రతిదానినీ, ప్రతివారినీ అనుమానిస్తూ క్షణక్షణానికీ జుట్టు పీక్కుంటూ బతికే కంటే, చిన్న చిన్న విషయాలలో మోసాలకు గురైనా నష్టముండదు అనుకుని బతికేయండి. 

* ఇంతకీ వీడు ఇదంతా ఎందుకు రాశాడే అనుమానం రాకపోతే మీరు మనిషి కానట్టే. 
*  మీకేమైనా డౌటా?!

- భోగాది వెంకటరాయుడు
99495 47374

Wednesday, July 6, 2011

ప్రముఖ వ్యక్తుల గొప్ప పోలికలు

ప్రపంచంలో భౌతికంగా ఒకే రకంగా ఉండే వ్యక్తులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఆ విషయం ఏమో కానీ తాము ఎంచుకున్న రంగంలో ఒకే విధంగా పాపులారిటీ సంపాదించిన వ్యక్తులు ప్రపంచంలో అనేకమంది కనిపిస్తుంటారు. ఈ ప్రముఖ వ్యక్తులు సముద్రాలు దాటి వేర్వేరు దేశాల్లో జన్మించినా తమ, తమ రంగాలలో ఒకే విధంగా రాణిస్తూ ప్రజలను ప్రభావితులను చేశారు, చేస్తున్నారు. వారు రాణించిన తీరు, జీవనశైలి, ఆలోచనలు కూడా ఒకే రకంగా ఉండడం విశేషం. ఇటువంటి కొందరు ప్రముఖులు, సెలబ్రిటీల గురించి ...

డాన్‌ బ్రాడ్‌మన్‌ - సచిన్‌ టెండూల్కర్‌
sachinఆసీస్‌ క్రికెట్‌ లెజెండ్‌గా పేరుగాంచిన డాన్‌ బ్రాడ్‌మన్‌ను, నేటి కాలంలో మాస్టర్‌ బ్లాస్టర్‌గా పేరుతెచ్చుకున్న సచిన్‌ టెం డూల్కర్‌ను క్రికెట్‌ చరిత్రలోనే బ్యాటింగ్‌ దిగ్గజాలుగా పేర్కొంటారు. సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ తన కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌గా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆయన 1920 దశకం చివరి కాలం నుంచి 1940 చివరి కాలం వరకు క్రికెట్‌లో బ్యాటింగ్‌ దిగ్గజంగా ప్రఖ్యాతిగాంచారు. ఆ కాలంలో ఆయన బాడీలైన్‌ బౌలింగ్‌ను గట్టిగా ఎదుర్కొన్న బ్యాటింగ్‌ లెజెండ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఆయన టెస్ట్‌ క్రికెట్‌ కెరీర్‌ను 99.94 సగటుతో పూర్తిచేయడం ఆయన ఎంత గొప్ప బ్యాట్స్‌మనో తెలియజేస్తుంది. ఇక మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ 16 సంవత్సరాల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన ఇక వెనక్కి చూసుకోకుండా బ్యాటింగ్‌ దిగ్గజంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. డాన్‌ బ్రాడ్‌మన్‌ తన 90వ జన్మదిన వేడుకలకు ఆహ్వానించిన ఇద్దరు క్రికెటర్లలో సచిన్‌ టెండూల్కర్‌ ఒకరు కావడం విశేషం. సచిన్‌ సైతం తనలాగే బ్యాటింగ్‌ చేస్తాడని డాన్‌ బ్రాడ్‌మన్‌ కొనియాడారు. ఓ రోజు బ్రాడ్‌మన్‌ టివిలో సచిన్‌ బ్యాటింగ్‌ను చూస్తూ తన భార్యని పిలిచి ‘సచిన్‌ను చూడు...అతను బ్యాటింగ్‌ చేసే విధానం, స్ట్రోక్‌ ప్లే, టెక్నిక్‌, డిఫెన్స్‌ ఇవన్నీ నేను ఆడినట్లే ఉన్నాయి. ఈ వయసులో నేను ఆడలేను కానీ...నా శైలిలో ఆడే సచిన్‌ బ్యాటింగ్‌ను చూస్తే నేను ఆడినట్లే అని పిస్తోంది’ అని సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించారుట.

షేక్స్‌పియర్‌ - కాళిదాసు
kalidasuప్రపంచప్రఖ్యాతిగాంచిన ఇంగ్లీష్‌ కవిగా షేక్స్‌పియర్‌ పేరుగాంచితే కవిరత్న కాళిదాసు సంస్కృత కవిగా ప్రఖ్యాతిగాంచారు. కాళిదాసు చక్రవర్తి విక్రమాదిత్యుని కొలువులోని తొమ్మిదిమంది రత్నాల్లాంటి కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వసీయమ్‌ వంటి నాటకాలు, రఘువం శం, కుమార సంభవం, మేఘదూత వంటి కవితలతో సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. షేక్స్‌పియర్‌ హామ్లెట్‌, ద మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌, రోమియో అండ్‌ జూలియట్‌, ఒథెల్లొ, కింగ్‌ లియర్‌ వంటి నాటకాలు వీనస్‌ అండ్‌ అడోనిస్‌, ద రేప్‌ ఆఫ్‌ ల్యుక్రీస్‌ వంటి కవితలతో గొప్ప కవిగా పేరుతెచ్చుకున్నారు.

మైకేల్‌ జాక్సన్‌ - ప్రభుదేవా
prabhudevaదక్షిణాది సినిమాల డ్యాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవాకు పాప్‌కింగ్‌ మైకేల్‌ జాక్సన్‌కు మధ్య ఓ పోలిక ఉంది. ఈ ఇద్దరు డ్యాన్స్‌ చేసే స్టైల్‌ ఒకే విధంగా ఉండడం విశేషం. ప్రభుదేవాని ఇండియన్‌ మైకెల్‌ జాక్సన్‌ అంటారు అభిమానులు.

మార్లిన్‌ మన్రో-మధుబాల

madubalaఒకప్పుడు హాలీవుడ్‌ను ఏలిన మహారాణిగా, అందాలతారగా మార్లిన్‌ మన్రో ఎంతో ప్రఖ్యాతిగాంచారు. ఆమె తన అందచందాలు, గ్లామర్‌, నటనతో పలు హిట్‌ సినిమాల్లో ప్రేక్షకులను మైమరపించారు. ఇక మన దేశానికి చెందిన అందాలరాశి, సినీతార మధుబాల సైతం నాడు పలు సక్సెస్‌ సినిమాలో చక్కగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. వీరిద్దరూ నాడు సినీ రంగాల్లో అగ్రతారలుగా రాణించి అపురూప సౌందర్యరాశులుగా పేరు తెచ్చుకున్నారు. మార్లిన్‌ మన్రో వీనస్‌ ఆఫ్‌ హాలీవుడ్‌గా పేరు గాంచితే మధుబాల వీనస్‌ ఆఫ్‌ బాలీవుడ్‌గా ప్రఖ్యాతిగాంచారు. మార్లిన్‌ మృతి నేటికీ మిస్టరీగా మిగిలిపోతే మధుబాల గుండెకు సంబంధించిన వ్యాధితో మరణించారు. వీరు చనిపోయి దశాబ్దాలు గడిచినా నేటికీ ఈ అందాలతారలను ప్రేక్షకులు గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

ఓర్సన్‌ వెల్స్‌ - గురుదత్‌
gurudathఅమెరికాకు చెందిన లెజండరీ సినిమా డైరెక్టర్‌, స్క్రిప్ట్‌ రైటర్‌, యాక్టర్‌, ప్రొడ్యూసర్‌ ఓర్సన్‌ వెల్స్‌. ఆయన రూపొందించిన పోర్ట్రయల్‌ ఆఫ్‌ సిటిజన్‌ కేన్‌ అంతర్జాతీయంగా ఎంతో పేరుతెచ్చుకుంది. ఆయన సినిమాలు ఒక్కోటి ఓ దృశ్య కావ్యంగా పేరుగాంచాయి. వెల్స్‌ మాదిరిగా గురుదత్‌ కూడా గొప్ప డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌, యాక్టర్‌గా పాపులారిటీ సంపాదించారు. ఆయన తీసిన ప్యాసా, కాగజ్‌ కే ఫూల్‌ వంటి సినిమాలు ఇప్పటి వరకు రూపొందించిన 100 బెస్ట్‌ ఫిల్మ్‌‌సలో ఒకటిగా పేరుతెచ్చుకున్నాయి. వీరిద్దరి జీవితాలు విషాదాంతంగా ముగిసాయి.

జాకీ కాలిన్స్‌ - శోభా డే
shobaసాహితీ ప్రపంచంలో తిరుగులేని రచయిత్రులుగా వెలుగొందుతున్నవారు జాకీ కొలిన్స్‌, శోభా డే. వారి నవలలు పాఠకుల విశేష ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. కేవలం రచయిత్రిగానే కాకుండా కాలమిస్ట్‌గా, సోషలైట్‌గా, డిజైనర్‌గా సైతం శోభాడే పేరుతెచ్చుకున్నారు. ఈ ప్రఖ్యాత రచయిత్రిని టైమ్‌ మ్యాగజైన్‌ ‘జాకీ కాలిన్స్‌ ఆఫ్‌ ఇండియా’కు కీర్తించింది.

పాబ్లొ పికాసో - ఎం.ఎఫ్‌.హుస్సేన్‌
m.s-hussenమన దేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ను ఫోర్బ్‌‌స మ్యాగజైన్‌ నాటి పాపులర్‌ ఆర్టిస్ట్‌ పబ్లొ పికాసోతో సరిపోల్చింది. వీరి పెయింటింగ్స్‌లో కొన్ని ఒకే శైలిలో రూపుదిద్దుకున్నాయి.ఎం.ఎఫ్‌.హు స్సేన్‌ మహాభారత సీరిస్‌లో భాగంగా గీసిన ‘దుర్యోధ న-అర్జున స్ల్పిట్‌’ పెయింటింగ్‌ పికాసో ‘గ్యుర్నికా’ పెయింటింగ్‌ ఒకే శైలిలో రూపుదిద్దుకున్నాయని ఆర్ట్‌ లవర్స్‌ పేర్కొంటారు.

షేక్‌ సౌద్‌ బిన్‌ అల్‌ థాని - మహరాజా యశ్వంత్‌ రావు హోల్కర్‌ 2
Sheikh-Saoud-binషేక్‌ సౌదా బిన్‌ అల్‌ థాని ఓ అరబ్‌ షేక్‌. మహరాజా యశ్వంత్‌ రావు హోల్కర్‌ 2 మన దేశంలోని ఓ రాజ్యా న్ని పరిపాలించి చాలా సంవత్సరాల క్రితం మరణించిన రాజు. కానీ వీరిద్దరి మధ్య ముఖ కవళికలు, పోలి కలు ఒకే విధంగా ఉంటాయి. ప్రస్తుతం జీవించి ఉన్న షేక్‌ తాను గత జన్మలో మహరాజునని నమ్ముతారు. ఖతర్‌ దేశానికి చెందిన ఓ రాజు భావమరది అయిన షేక్‌ ఓ రోజు అమెరికన్‌ ఆర్టిస్ట్‌ మ్యాన్‌ రే గీసిన మహ రాజా యశ్వంత్‌ రావు హోల్కర్‌ 2 చిత్రపటాన్ని చూశారు. ఆ రాజుకు తనకు మధ్య పోలికలు ఉండడాన్ని గమనించిన ఆయన తానే గత జన్మలో ఆ రాజునని చెబుతారు. ఇద్దరూ సన్నగా ఉండడంతో పాటు ముఖం లోని వివిధ అవయవాలు సరిపోలినట్లు ఉంటాయి. ఐశ్వర్యవంతుడైన షేక్‌ దివంగత మహరాజా పెయింటింగ్‌లో పోజుతో ఫొటోలను కూడా తీయించుకున్నారు. ఇక మహరాజా 1961 సంవత్సరంలో మృతిచెందగా షేక్‌ జన్మించింది మాత్రం 1966లో.

టామ్‌ హ్యాంక్స్‌ - అమీర్‌ ఖాన్‌
ameerkhanపలు చిత్రాల్లో వెరైటీ క్యాప్స్‌తో అలరించిన టామ్‌ హ్యాంక్స్‌, అమీర్‌ ఖాన్‌లు ముఖ కవళికలు కూడా ఒకే విధంగా ఉంటాయంటారు వారి అభిమానులు. వారి నటన కూడా ఒకేవిధంగా ఉంటుందని చెబుతారు. ఇక ఆసియా సొసైటీ ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ హ్యాంక్స్‌కు తనకు మధ్య పెద్దగా పోలికలు లేవని కొట్టిపారేశారు.

సుసాన్‌ సరండన్‌ - షబనా ఆజ్మీ
చక్కటి నటనతో ఎన్నో అవార్డు లను గెల్చుకున్న నటీమణులు సుసాన్‌ సరండన్‌, షబనా ఆజ్మీలు. హాలీవుడ్‌లో ఒకరు, బాలీవుడ్‌లో ఒకరు పాపులారిటీ సంపాదించుకున్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలో వీరిద్దరూ ఎల్లప్పుడూ ముందుండడం వీరిద్దరికీ ఉన్న ఓ మంచి లక్షణం.

రాబర్డ్‌ డి నీరో - అమితాబ్‌ బచ్చన్‌
bigbనాటి నుంచి నేటి వరకు దశాబ్దాలుగా సినీ రంగంలో పాపులర్‌ హీరోలుగా పేరుతెచ్చుకున్న వ్యక్తులు రాబర్డ్‌ డి నీరో, అమితాబ్‌ బచ్చన్‌లు. హాలీవుడ్‌లో రాబర్డ్‌ డి నీరో పలు హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తే బాలీవుడ్‌లో బిగ్‌ బి యాంగ్రీ యంగ్‌మన్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఫ్లో జో - ఆశ్విని నాచప్ప
shwiniప్రపంచంలోని గొప్ప లేడీ అథ్లీట్స్‌లో ఒకరైన ఫ్లోరెన్స్‌ గ్రిఫిత్‌ జాయ్‌నర్‌ 1988 సియోల్‌ ఒలిపింక్స్‌లో స్ప్రింట్‌ డబుల్‌తో పాటు రిలేలో గోల్డ్‌ మెడల్స్‌ను సాధించి అం దరి దృష్టిని ఆకర్షించారు. కేవలం అథ్లెటిక్‌గానే కాకుండా ఆమె ఫ్యాషనబుల్‌ వస్త్రాలు ధరించడం, ఆరు అంగుల పొడవైన రంగు, రంగుల చేతి గోర్లతో ఆ కాలంలో ఫ్యాషన్‌ సింబల్‌గా నిలిచారు. ఇక ఇదే తరహాలో మన దేశానికి అథ్లెట్‌ అశ్వినీ నాచప్ప కూడా పేరు తెచ్చుకున్నారు. 1980 చివరి దశకం నుంచి 1990 దశకం ప్రారంభం వరకు అశ్విని నాచప్ప గొప్ప అథ్లెట్‌గా పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా ట్రెండీగా హెయిర్‌ స్టైల్‌, ఉపయోగించే ఫ్యాషన్‌ యాక్ససరీస్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

బిల్‌ గేట్స్‌ -అజీమ్‌ ప్రేమ్‌జీ
bilgets2010 సంవత్సరం ప్రారంభంలో ఫోర్బ్‌‌స మ్యాగజైన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీని సాఫ్ట్‌వేర్‌ మొగల్‌ బిల్‌ గేట్స్‌తో సరి పోల్చింది. గేట్స్‌ మాదిరిగానే విప్రో చైర్మన్‌ అజీమ్‌ సైతం తన ఆదాయంలో పెద్ద మొత్తాన్ని ఛారిటీ కార్యక్రమాలకు వెచ్చిస్తూ వస్తున్నారు. ఆయన తన అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా 2010 డిసెంబర్‌లో 88,460,000,000రూ.లను సేవా కార్యక్రమాలకు కేటాయించడం విశేషం. 2011 జూన్‌లో ఆసియన్‌ హీరోస్‌ ఆఫ్‌ ఫిలాంత్రపీగా కీర్తించిన దేశంలోని నలుగురు ప్రముఖులలో ప్రేమ్‌జీ ఒకరిగా నిలిచారు.


-ఎస్‌.అనిల్‌ కుమార్‌