Friday, December 30, 2011

ఆకలి నుంచి...అభివృద్ధికి

Memi
‘మేము ఎప్పుడు ఒక రసగుల్లా స్వీట్‌బాక్స్‌ను ఇంట్లో ఉంచే వాళ్లం.ఒక రోజు అందులో విషం కలిపి అందరికీ తినిపించాలని భావించాను. ప్రతీరోజూ తిండి కోసం నానా కష్టాలు పడటం కన్నా ఈ దారే ఉత్తమంగా తోచింది. అన్ని కష్టాలను భరించి ఎందుకు జీవించడం అనిపించింది’ అంటారు మేమీ దేవి. ఇలా ఆలోచించిన మేమీ దేవి నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎలా ఎదిగింది అనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మేమీ దేవి జీవిత గాథ ఎంతో స్పూర్తిదాయకం. మేమి దేవి కృషికి ఫలితంగా 2011 సంవత్సరానికి గాను ‘సిటి మైక్రో ఎంట్రిప్రిన్యూర్‌ అవార్డు’ వరించింది.

ఏమయింది అసలు?
మేమి దేవి భర్త మణిపుర్‌ రాష్ట్ర రవాణ సంస్థలో కాంట్రా క్టర్‌గా చేసేవారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపు రించిందనే సందేహం రావచ్చు. 2005లో ఆయనకు అం దులో ఉద్యోగం కొన్ని అనివార్య కారణాల వల్ల కోల్పో డంతో మేమి దేవి కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఆలోచనల నుంచి బయట పడి సానుకూలంగా అలోచించారు మేమీ దేవి. దీంతో 54 సంవత్సరాల మేమి దేవి తన చుట్టు పక్కల ప్రాంతంలో తమ జీవితాన్ని అనేక సాధక బాధకాలతో నెట్టుకొస్తున్న కొన్ని వేల మందికి ఆదర్శంగా నిలించింది.

కుటుంబ సహకారం...
mainnnn 
ప్రారంభంలో ఆమెకు కొన్ని సమస్యలు వచ్చాయి. టైర్ల నుంచి కవర్లను తీయడం, వాటిటి సైజ్‌, క్వాలిటీని బట్టి వేరుచేయడం కష్టంగా అనిపించేవి. ఈ పనులలో ఆమె కు కుటుంబసభ్యులు సహకరించే వారు. మణిపుర్‌లోని ‘చనుర్‌ మైక్రోఫైన్‌ మణిపుర్‌’ (సిఎమ్‌ఎమ్‌) నుంచి రెండు సార్లు అప్పు తీసుకున్నారు. ఈ సంస్థ ఆమెకు తగిన పరిక రాలు కొనుగోలు చేయడంలో సహకరించింది. ‘ప్రస్తుతం నాతో పాటు మరో నలుగురు పని చేస్తున్నారు’ అంటారు దేవి. టైర్లనుంచి కవర్‌లను వేరు చేయడం పూర్తయ్యాక ఒక వ్యక్తి ఉదయం 7 నుంచి సాయంత్రం నాలుగు వరకు పనిచేసి రోజుకు 25 బకెట్లను తయారు చేయగలడు.

వార్షిక ఆదాయం...
ఇలా ప్రారంభమైన మేమి దేవి ప్రస్థానం ఎందరికో ఆదర్శ వంతంగా సాగుతోంది. నేడు ఆమె వార్షికంగా రూ.4 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తుండగా అందులో ఆమెకు మిగిలేది రూ.1.4 లక్షల రూపాయలు.తన సంస్థతో ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ వారికి కూడా సరికొత్త జీవితాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

తొలి ఆర్డర్‌...
go-green-recycle-tire 
ఫ్లవర్‌ పాట్‌ (పూల తొట్టె)లు తయారు చేయడం ప్రారంభించాక ఆమె బకెట్లను కూడా తయారు చేయ వచ్చని భావించి దాని కోసం ప్రయత్నాలు ప్రారంభిం చారు. ఇక మెటల్‌ బకెట్‌ను వాడి అలాంటిదే ఒక బకెట్‌ తయారు చేయడానికి ప్రయత్నించింది. ఫలితం ‘సక్సెస్‌’. ఏ వ్యాపారానికైనా తొలి ఆర్డర్‌కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వేల కోట్లు సంపాదించిన వాణిజ్యవేత్త అయినా తన ‘బోణీ’ ఆర్డర్‌ను మర్చిపోలేడు. మేమి దేవి తొలి ఆర్డర్‌ 100 బకెట్లు. తొలి అడ్వాన్స్‌ రూ.500. తొలి ఆర్డర్‌ను టైమ్‌కి అందజేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. మరి ఏ వ్యాపారికైనా లాభం కన్నా పేరు ముఖ్యం కదా..ఆ పేరే ఆమెకు మరిన్ని విజయాలను తెచ్చిపెట్టింది.

ట్విస్ట్‌...

మేమి భర్తకు  ఉద్యోగం పోయాక అతను కొత్త ఉద్యో గం కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం లభించలేదు. దీంతో నిరాశకు గురైన అతను ఉద్యోగాల వేటకు స్వస్తి పలికాడు. ఆ సమయంలో భర్తను నిందించకుండా అర్ధం చేసుకుంది మేమి.కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకో వాలని నిర్ణయించుకొని స్వీట్‌ పకోడిలను అమ్మడం ప్రారంభించింది. ఎంతో కొంత అదాయం వచ్చేది. స్వీట్‌ పకోడిలు మణిపురి రాజధాని ఇంఫాల్‌లో పాపులర్‌ . అప్పటికీ ఆమె నలుగురు సంతానం స్యూల్‌కి వెళ్ళే వారు. అయితే ఒక రోజు మేమి కుమారుడు టైర్‌ నుంచి వేరు చేసిన కవర్‌తో ఆడుకోవడాన్ని గమనించారు. అప్పుడే అమెకు దాంతో ఒక ఫ్లవర్‌ పాట్‌లను తయారు చేయవచ్చనే ఆలోచన కలిగింది. దాంతో వెంటనే తగిన చర్యలు తీసుకున్నారు.

అవసరమే ఆవిష్కారాలకు ....
Tyre 
నేటి గ్లోబలైజేషన్‌ కాలంలో ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు వస్తువులను సరఫరా చేసే లారీలు, మన ప్రయాణానికి ఉపయోగపడే బస్‌లు, ఆటోలు, బైక్‌లు వాహనం ఏదైైనా అన్నింటిలో ముఖ్యమైనది ఏంటి? ‘టైర్లు’. చాలా మంది పాత టైర్లకు అంతగా ప్రాధాన్యతనివ్వరు. వాడి పడేయటం వంటివి చేస్తుంటారు లేదా పాత వస్తువులను కొనే షాప్‌లలో అమ్ముతుంటారు.మేమి దేవి విషయంలో ఈ టైర్లే జీవనాధారం అయ్యాయి. అమె వాడిన టైర్లతో బకెట్లు, ఫ్లవర్‌ పాట్‌లు తయారు చేసేది. వాటిని చక్కగా మార్కెటింగ్‌ చేసి తగినంత లాభాన్ని ఆర్జించేది. దీంతో కుటుంబం ఆర్థికంగా పుంజుకుంది.

వినూత్న ప్రచారం...
ఆమె బకెట్లు, ఫ్లవర్‌ పాట్‌లను తయారు చేయడం లోనే కాదు ప్రచారంలోనూ వైవిధ్యతను పాటించే వారు. తన సంస్థ తయారు చేసిన బకెట్లను ఒక బిల్డింగ్‌పై నుంచి పడేసి మరి దాని నాణ్యతను నిరూపించేది. స్థానిక రేడియోలో ప్రకటనలిచ్చేది. ఈ అంశాలు స్థానిక సంస్థలను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆమె తన ఉత్పత్తులను ఈశాన్య రాష్ట్రాలైన ఆసోం, మిజోరం, నాగాలాండ్‌ రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. ప్రస్తుతం తన ఉత్పత్తుల నాణ్యతను మరింతగా మెరుగు పర్చడానికి అలైన్‌మెంట్‌ యంత్రాన్ని కొనడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు.

అవార్డులు
మేమి దేవి కృషికి ఫలితంగా 2011 సంవత్సరానికి గాను ‘సిటి మైక్రో ఎంట్రిప్రిన్యూర్‌ అవార్డు’ వరించింది. ఈ అవార్డును ఆమె ఇటీవలే స్వీకరించారు. ఈ సమయంలో ఆమె తన గతంలోని కొన్ని అంశాలను ప్రస్థావించారు. తన భర్తకు ఉద్యోగం పోయిన వెంటనే తన కుటుంబ పరిస్థితి గురించి వివరించారు. రెండు పూటల భోజనానికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందని తెలిపారు. ఆమె కథను విన్న వారంతా దేవికి ఈ అవార్డు రావడం సమంజసమేనని భావించారు. చాలా మంది అమె దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా అభినందించారు. అంద రికి చిరునవ్వుతో సమాధాన మిచ్చారు. ఒక వాణిజ్యవేత్త తాలూకు మొదటి ఇన్‌వెస్ట్‌మెంట్‌ ‘చిరునవ్వు’ అని పుస్తకాలు చదవకున్న తెలుసుకున్నారామె.
 ప్రొఫైల్‌
పూర్తి పేరు  : మేమి దేవి
జన్మస్థలం  : మణిపూర్‌
వృత్తి  : చిరు వ్యాపారి
వ్యాపారం : వాడిన టైరు కవర్లతో ఫ్లవర్‌ పాట్‌, బెకట్‌ల తయారి
ప్రాంతాలు :అసోం, మిజోరం, నాగలాండ్గ మార్కెట్‌లో
అవార్డు  : సిటి  మైక్రో ఎన్‌ట్రిప్రిన్యుర్‌ అవార్డు-2011

No comments: