Wednesday, June 15, 2011

నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. * రే క్రాక్

రే క్రాక్.. 52వ వసంతంలో మొదలైన జీవనయానం. నా వయస్సు 52 డయాబెటీస్ ఆర్ధట్రాయిస్.. రెండూ ఉన్నాయి నాకు. ఇంతకు మునుపే గాల్ బ్లాడర్‌ని, థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం తీసేసారు. అయినప్పటికీ నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెక్ డొనాల్డ్ సంస్థ నిర్మాణంలో ముఖ్య భూమిక నిర్వహించిన రే క్రాక్ చెప్పిన మాటలివి. ఎప్పుడు మెక్ డొనాల్డ్ సంస్థలో చేరే ముందు.

మనలో చాలా మంది ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా చివరికి జలుబు చేసినా తల్లడిల్లి పోతాం. ధైర్యం తక్కువ, పిరికితనం ఎక్కువ. గెలుపు మీద కంటే ఓటమి మీదే నమ్మకం ఎక్కువ. తప్పక గెలుస్తామనే నమ్మకం కంటే గ్యారెంటీగా ఓడిపోతామనే నమ్మకం జాస్తి. వీరందరికీ రే క్రాక్ మాటలు మార్గదర్శకమవ్వాలి. 

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgJui9JLjQSSMUu6m30oSGwwJUjy9FpdJI6HMCiYM0D1gIf9sIF2UJt4E7QASFX7MtzciTlpdcS1dtEjRNMmn1v8FGMBqbI-tfOPKRxf1fWp76Xw7bE1KigHftvuFOS-DIc1OJ3qzpm7BN8/s320/Kroc.jpg

సాధించిన రేక్రాక్

మెక్ డొనాల్డ్స్‌ను ఒక గొప్ప అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దిన రే క్రాక్ గురించిన ముచ్చట్లు మొదలుబెట్టాం గతవారం. ఆయన ఎంతో గర్వంగా తనను గురించి చెప్పుకున్న మాటల్ని మరోసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. నా వయస్సు 52, డయాబిటీస్, ఆర్ధయిటిస్ రెండు ఉన్నాయి. నాకు ఇంతకు మునుపే గాల్ బ్లాడర్‌ని, థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం తీసేసారు. అయినప్పటికీ నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ఇటువంటి ధైర్య సాహసాలు, స్వశక్తిపై విశ్వాసం, నమ్మకం.. ఎటువంటి అడ్డంకులు వచ్చినా కలలను సాకారం చేసుకోవాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తి విజేతగా రూపాంతరం చెందుతాడు. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు.http://www.browsebiography.com/images/2/808-ray_kroc_biography.jpg
ఆశావాదం విజేతకి కావాల్సిన ఒక గొప్ప అవసరం. చాలామంది విజేతల్లో మనకు కొట్టొచ్చినట్లు కనబడే గుణమిదే. మనం ఓ స్వామివారి దగ్గరికెళ్లి మన కష్టాల్ని ఆయన పాదాల మీద కుమ్మరిస్తాం. ఆయనేమని దీవిస్తారు ? ధైర్యంతో ఉండు.. అన్ని సర్దుకుంటాయి అనేగా. అలాకాకుండా ఇది కష్టకాలమే అంటే మన గతేం కాను. ప్రాణం ఊసురుమంటుంది.

అలాగే డాక్టర్ కూడా.. మా ఫ్యామిలీ డాక్డర్ గారున్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గారని. ఆయన్ని కలుసుకుంటేనే సగం బాధ, రోగం తగ్గిపోతాయి. ఇక ఆయన చెప్పిన ధైర్య వచనాలు విన్నాక మిగతా సగం మారిపోతాయి. వైద్యుడు దేముడితో సమానం అన్నారు కదా ఆర్యులు. వారు మనకిచ్చేదేమిటి ? ధైర్యమే కదా. ఆపదలు తొలగిపోతాయని నమ్మకమే కదా.
http://jeremywaite.files.wordpress.com/2010/05/0427_18innova.jpg
ధైర్యే సాహసే లక్ష్మీ. ఆశావాదికి అలవోకగా అబ్బే గుణమే ధైర్యం. రే క్రాక్‌కి ఉన్నన్ని ఆరోగ్య సమస్యలు మరెవరికైనా ఉండి ఉంటే అన్ని పనులు వదిలి, నిరంతరం దిగులుతో నిస్సహాయంగా పైవాడి పిలుపుకి ఎదురు చూస్తుండేవారు అవునా కాదా ? మెక్‌డొనాల్డ్ సోదరులు స్థాపించిన మెక్‌డొనాల్డ్ హేంబర్గర్ రెస్టారెంట్స్‌ని కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన ఘనత రే క్రాక్‌ది.http://static6.businessinsider.com/image/4d52e37349e2ae5b32180000-400-300/1-raymond-albert-kroc-mcdonalds.jpg
ఈ రంగ ప్రవేశం చేసే ముందు రే క్రాక్ రకరకాల పనులు చేశాడు. తన పదిహేనో ఏట ట్రక్ డ్రైవర్ అయ్యాడు. ఆ తర్వాత పియానో ప్లేయర్ ఉద్యోగం సంపాదించాడు. ఆ పిమ్మట పేపర్ కప్పులు అమ్మే కంపెనీలో సేల్స్‌మెన్ అయ్యాడు. ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడే మిల్క్ షేక్ మిక్సర్లు తయారు చేసే ఓ పెద్ద మనిషితో పరిచయమైంది. ఆ పరిచయం ఆ కంపెనీలో ఓ ఉద్యోగిగా మార్చగా ఆ తర్వాత 17 సంవత్సరాలు మిక్సర్లు అమ్ముతూ అమెరికా అంతా తిరిగాడు. http://www.keyvive.com/wp-content/userimages/1268755181ray-kroc-and-mcdonalds.jpg
అలా తిరుగుతూ మిక్సర్లు అమ్మటానికై మెక్ డొనాల్డ్ సోదరులను కల్సుకున్నాడు. వాళ్లు నడుపుతున్న రెస్టారెంట్స్ రే క్రాక్‌ని ఎంతో ప్రభావితం చేసినాయి. అవి ఎంతో చక్కని రెస్టారెంట్స్ అని వాటిని దేశవ్యాప్తంగా తెరిస్తే వాటికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని రే క్రాక్ ఆ సోదరులకు చెప్పాడు.http://www.teambuilding-leader.com/images/RayKroc.jpg
ఆయన బాగానే ఉంది కాని ఈ బాధ్యతనెవరు తలకెత్తుకుంటారంటే నేలేనా అన్నాడు. రెస్ట్ ఈజ్ హిస్టరీ మిగతాదంతా చరిత్ర అంటాం కదా. అలాగే రే క్రాక్ మెక్ డొనాల్డ్స్‌లో చేరాక ఒక చరిత్ర సృష్టికి మూలకారకుడయ్యాడు. అప్పుడు ఆయన వయస్సు 52. ఎన్నో ఆరోగ్య సమస్యలతో పో రాడుతున్నాడు. అయితే అదేమి ఆయన్ని క్రుంగ దీయలేదు. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjvvaf_ciKkNtoQdbaK3Ij51pW3FN7mkQH5Vr1nOg8q1ACLyoPPaWnbHdSSGjpZ4UX9fs2aPuMxIuyuXT48mb5F0CyD8NmYMCb4MSU1xIkHkH7xHkeiBNRE8B_LYBq7gsNzYbBTLi720xnD/s1600/June+Martino.jpg

June Martino - The Silent Backbone of McDonald's

Ray Kroc, Harry Sonnenborn, June Martino, Don Conley & Fred Turner - 1960 
In 1948 June Martino became Ray Kroc's (founder of McDonald's Restaurants) bookkeeper. She rose to Corporate Secretary, Director and part owner of the corporation. 

అందుకు ఒకటే బలమైన కారణం. ఆయన కన్న కలలు సాకారం చెందే ఘడియలు ఇంకా చేరువ కాలేదు. అందాకా తన కృషి సాగుతూనే ఉండాలి అనేది ఆయన నమ్మకం. ముందు చెప్పుకున్నట్లుగా వేరెవరికయినా అలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన వలసి వస్తే అదే జీవిత చరమాంకం అనుకుని ఆగిపోయి ఉండేవారు. కాని రే క్రాక్ విషయంలో ఆయనకు తన ఆరోగ్య సమస్యలు గొప్ప సమస్యలుగా గోచరించినట్లు ఆధారాలు లేవు.

రే క్రాక్ గురించి నేను రీసెర్చి చేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన తన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించలేదు. కనుక ఆయన పరిపూర్ణ ఆరోగ్యవంతుడనుకున్నాను. తర్వాత ఆయన ఆరోగ్య విషయం గురించి అసలు సంగతి తెలుసుకున్నాక నోట మాట రాలేదు. ఈయన తన 52 వ ఏట ఇటువంటి అనారోగ్యంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడా? ఆకాశానికి అంతేది ? అవకాశాలకు అంతేది? ధైర్య సాహసాలు, కలలు గమ్యాలున్న వ్యక్తికి ఎదురేది ? నేను ఆరాధించే హీరోల్లో రే క్రాక్ ముఖ్యులు. కొండంత ధైర్యం, అన్నీ సుసాధ్యాలే అని నమ్మే ఆయన మనస్తత్వం ఈ ఆరాధానికి కారణం. ఇలాంటి వ్యక్తులు చాలా కొద్ది మంది తారసపడ్తారు మనకు జీవితంలో.

వారి జీవితాలు నేర్పే పాఠాలు అమూల్యమైనవి. ఆచరణీయమైనవి. నేటి మెక్‌డొనాల్డ్స్ విశ్వ దర్శనానికి రే క్రాక్ కృషి మూల స్థంభం. ఒకసారి గూగుల్ సెర్చ్‌కి వెళ్లి నేటి మెక్ డొనాల్డ్ రూప దర్శనం చేయండి. అదో అంతర్జాతీయ మహా వృక్షం. విత్తనం వేసింది మెక్ డొనాల్డ్స్ సోదరులైనప్పటికీ ఈ సంస్థను ప్రపంచమంతటా విస్తరింప చేసి నేటి స్థాయికి తెచ్చిన ఘనత రే క్రాక్‌దే.

జయహో రే క్రాక్ మహాశయా.. జయహో.

 - ఎజి కృష్ణమూర్తి

Tuesday, June 14, 2011

కల, కృషి, కాలం.. ఇవే మన ఆయుధాలు.

 http://www.hindu.com/mag/2006/03/26/images/2006032600370104.jpg
కలలను, గమ్యాలను విడనాడొద్దు. ప్రఖ్యాత రచయిత పాల్ కోయిలో చెప్పినట్లుగా మీకే బలమైన కోరికుంటే, ప్రపంచంలోని అన్ని శక్తులు కుట్రపన్ని, కూడబలుక్కుని మీ కలలను సాకారం చేస్తాయి. కుట్రపన్ని.. ఎంతో పవర్‌ఫుల్ శక్తివంతమైన పదప్రయోగం. ఎంత గట్టి నమ్మకం లేకపోతే పాల్ కోయిలో దీన్ని వాడుంటాడు. ది వరల్డ్ లవ్స్ ఎ లవర్ అనేది నానుడి. ప్రేమికులను ప్రపంచం ప్రేమిస్తుందని.. అలాగే కలలు, గమ్యాలు కల వారికి ప్రపంచంలోని అన్ని శక్తులు సహకరిస్తాయి.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgxPXhA5Hf00b2VDXfMw1eVBsN-SLZe9CmJp2OhklM_P9PSnB18l7kbONuWEUbfaWrSS4uuHRQPiMJppt9O7wtBsE_6vDG4AlL_BzsmX9Qt8nsjaH26seJFT97UhAZG-MjMpcqv0FTk1W8r/s1600/tyeb_mehta_tayyab_india_artist.jpg
తయబ్ మెహతా ఈ మహాశయునికి తన కల నిజమైంది ఎనభయ్యోపడిలో ప్రవేశిస్తున్న తరుణంలో. తయబ్ మెహతా.. నెమ్మదస్తుడు. నిరహంకారి. పెయింటర్. పేరు ప్రఖ్యాతులున్న పెయింటర్ అనగానే ఎంతో గర్వంతో, అంటీ అంటనట్లు ఉంటారేమోననుకుంటాం. మన మనస్సులో సృష్టించుకున్న పెయింటర్ల రూపకల్పనకు పూర్తి విరుద్ధం తయబ్ మెహతా. పెయింటింగ్ తనకు స్పూర్తిదాయకమైంది. గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. కనుకే పెయింటర్ అయ్యాడు కాని ధనార్జన కోసం చేపట్టిన వృత్తి కాదు.

గత అధ్యాయం పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బులో ఈ విషయా న్ని కూలంకషంగా చర్చించుకున్నాం కదా. ఇదే జరిగింది తయబ్ మెహతా విషయంలో కూడా. ఖ్యాతి.. ఆపై ధనార్జన.. వృత్తిరీత్యా ముంబైలోని ఫేమస్ స్టూడియోలో ఎడిటర్‌గా పనిచేస్తుండేవాడు. అయితే ఆ ఉద్యోగం మూడునాళ్ల ముచ్చటే అయింది. మళ్లీ విద్యార్ధిగా మారాడు ముంబైలోని సర్ జెజె ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో చేరి పెయింటింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నాక పుంఖానుపుంఖాలుగా పెయింటింగ్స్ వేశాడు.
http://www.economist.com/images/columns/2007w28/KaliHead.jpg
మధ్య తరగతి వర్గానికి చెందిన పలు పెయింటర్లలాగా తిండి, బట్టకే కాదు, పెయింటింగ్ చేసుకునే కాన్వాస్ కొనటానికి కూడా డబ్బు ఉండేది కాదు. పేరు ప్రఖ్యాతులు గడించాక న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు తయబ్.. ఎగ్జిబిషన్‌లో పెట్టేందుకు కావాల్సిన కాన్వాస్ కొనే స్థోమత కూడా కరువయ్యేది కొన్నిసార్లు.. అని. ఇంట్లో ఎప్పుడైనా తిండికి డబ్బుల్లేక పోతే పోన్లే ఈ రోజు పస్తుంటాను అని తయబ్ అంటే లేదు మనిద్దరం కలసి పస్తుందాం అనేదట ఆయన భార్య. భార్య సంపాదించేంది. తయబ్ పెయింట్ చేసేవాడు. ఇలా ఒక పుష్కర కాలం గడిచింది కష్టాల్లో, కడగండ్లతో.. చివరికి తయబ్ తన ఫస్ట్ పెయింటింగ్‌ను తన మిత్రుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ ద్వారా పరిచయమైన వ్యక్తికి అమ్మాడు 30 అమెరికన్ డాలర్లకు.. అంటే 1,350 రూపాయలకు.

పోరాటం..పోరాటం.. జీవన పోరాటం... ఇలా సాగుతూనే ఉంది ఏళ్ల తరబడి తయబ్ జీవితంలో. తను 75వ వసంతంలో ప్రవేశిస్తున్న తరుణంలో, గుర్తింపు అదీ అంతర్జాతీయ ప్రమాణాల్లో లభించింది. ఆ గుర్తింపుతో పాటు లక్ష్మీ కటాక్షం. సెలబ్రేషన్ అనే ఆయన సృష్టి మూడు లక్షల అమెరికన్ డాలర్లకు విక్రయించబడింది. నేటి రేట్ల ప్రకారం కోటి ముప్ఫై లక్షల రూపాయలన్నమాట. ఆ తర్వాత మరో విక్రయం.. క్రిస్టీస్ న్యూయార్క్అనే అంతర్జాతీయ వేలం పాడే సంస్థ తయబ్ మహిషాసుర అనే సృష్టిని 1.58 మిలియన్ అమెరికన్ డాలర్లకు విక్రయించింది. అంటే దాదాపు ఏడు కోట్ల రూపాయలు. ఇది రికార్డులను బద్దలు కొట్టిన విక్రయం.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLp6K_NPPSmGy0x_P9xpzF7EAWOsu_80UmN9BsCM4g1SbbpvasRLJWeHA01BR5Uo2i8xwVCzX9VuQJoRFgGOgOK3NAzkCLoxvaUbWA5caTeyC-_b1G0v1UnehYzLwQz_oSYE2xhfjT9j8U/s1600/tyeb_mehta_tayyab_india_artist03.jpg
ఏ భారతీయ పెయింటర్‌కైనా ఒక మిలియన్ డాలర్ల మూల్యం లభించిన ప్రథమ సందర్భం ఇదే. అంటే ఈ రంగంలో ఒక నూతన శకానికి నాంది పలికిన విక్రయం దాన్ని తయబ్ ఎనభయ్యో పడిలోకి ప్రవేశిస్తూ సాధించాడు. అందుకే చెప్పేది మాటిమాటికి, మరోసారి, మరోసారి అని ఆశను, గమ్యాన్ని కోల్పోకుండా మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి. కలల్ని గుండెల్లో భద్రంగా పదిలపరచుకొని. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు కాని తప్పక వస్తుందనేది మాత్రం నిజం, ముమ్మాటికీ నిజం. మన నిరీక్షణ సాగిపోతూనే ఉండాలి.

మహిషాసుర రూ.7 కోట్లు


Mahishasura – sold for $1,280,900
Mahishasura by Tyeb Mehta
తయబ్ జీవిత కాలం కృషికి ప్రతిఫలం.. పేరు ప్రతిష్ఠ, లక్ష్మీ కటాక్షం.. ఆయన డెభ్భై ఏడో వసంతంలోకి అడుగిడబోతుండగా లభించింది. మీకు, నాకు ఎంతో తొందరగా లభ్యం కావచ్చు లేదా ఆలస్యంగానైనా. తన పెయింటింగ్‌కి ఎన్నో కోట్ల ధర పలికిందన్న వార్త సంతోషం కన్నా ఒక తమాషాలాగా, విచిత్రంగా గోచరించింది తయబ్‌కి. ఒక ఇంటర్వ్యూలో ఈ గుర్తింపు నా జీవితంలోనే జరిగినందుకు సంతోషంగా ఉంది. నా వయస్సు ఎనిమిది పదులు. ఎప్పుడైనా పైనుంచి పిలుపు రావచ్చు. ధనవంతుల వాళ్లకిష్టమైన ధరకు నా పెయింటింగ్స్‌ను కొనుక్కోవచ్చు అది వాళ్లిష్టం అన్నాడు తయబ్. తయబ్ జీవిత అనుభవాలు మనకు మార్గదర్శకాలవ్వాలి.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjA2e35AC7wWn9auRRJeLY2SLZs3QgZqYRW8bhs8VuiBS0R8hYXP1BwIpPT5mGWQ49AlI62RuIzEDXcAdqs_HP3saqVYZ5MRVtqbdQ95j1-mhDavMER9R4YLsxiTfBj4221jVUPlwzK0C9h/s1600/tyeb_mehta_tayyab_india_celebration_03.jpg
నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా మనపని మనం చేసుకుంటూ ఉండాలి. కలల్ని సజీవంగా ఉంచుకోవాలి. మరోసారి అం టూ అలుపెరగకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. పదేపదే ఈ విషయాన్నే వత్తివత్తి ఎందుకు చెబుతున్నానంటే కొంచెం నిరాశ నిస్పృహలకే గమ్యాలను వదలి కొత్త దోవలను ఎంచుకునే వారెందరో. మరో తరగతికి చెందిన వారు వృత్తి ఒకటి, ప్రవృత్తి మరొకటిగా ఎంచుకుని ఆ రెండింటిలోని ప్రత్యేకమైన అర్హతలుగాను అనుభవం కాని పొందక, ఆశించిన ఫలితాలు పొందలేక జీవితాసక్తి కోల్పోతారు.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQwjNLounz21BWecaH89rU4VzuCMljWi0xItCN-ritwXPbT1MWG_Q0FOklpZD72OJOls_h256QX-Dcvr1xsB4iSCjodzlpXxrssd0tIfeAOZnpoIPU_Y0KiikbAO5gT7Z3ey7atmyxi7Ye/s1600/tyeb_mehta_tayyab_india_artis01.jpg
ఇదికాదు మార్గం.. తయబ్‌కి తనకిష్టమైన రంగం పెయింటింగ్ అని గ్రహించాక ఆ రంగంలో అర్హత, అనుభవం పొంది కొన్ని దశాబ్దాలు నిరాశ, నిస్పృహలకు గురి కాకుండా తన పనిచేసుకుంటూ పోయాడు. విజయాలు కాక మరేం వరిస్తాయి అటువంటి దీక్ష, పట్టుదల కలిగిన వ్యక్తులను. ఒకే జీవితం, ఎన్నో అవకాశాలు. ఆత్మానందం ఎదురు చూస్తోంది మన కోసం. కల, కృషి, కాలం.. ఇవే మన ఆయుధాలు.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiBRnhCS2XVdcqp0mmOxNviF7YdJtXA3-fU3mCxtT1Zk47MzF-jihsteDCMKUaV13ziedO59bVzxSXG6-t52EV51YcA1FFTDV_q1JJKoWBHogqWyiThgLtAzUD6LiTJVCFAJjfFtZ2PVzS7/s1600/tyeb_mehta_tayyab_india_artist02.jpg
మనపై మనం పెంచుకున్న అపనమ్మకాన్ని పారద్రోలి నమ్మకాన్ని పెంచుకోవాలి. మా గురువుగారు చెప్పినట్లుగా శక్తినంతయు నీలో కలదన్నా... లోని శక్తిని తెలిసి ధైర్యమును కలిగి యుండన్నా. అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి మనలో.. నిద్రాణమైన వాటిని వెలికితీస్తే ఎదురేముంది.
- ఎజి కృష్ణమూర్తి

నమ్మకమే నడిపిస్తుంది

ఎన్ని అడ్డంకులొచ్చినా మీ కలలను, గమ్యాలను విడవద్దు.. మరోసారి ప్రయత్నిస్తానంటూ పదండి ముందుకు. విజేతలకి, ఇతరులకు ఉన్న తేడా ఇదే. కలల్ని మన సొంతం చేసుకొని అవి మన పంచప్రాణాలేమోనన్నట్లుగా వాటిని గుండెలకు హత్తుకుని మన దగ్గరే పదిలంగా ఉంచుకుంటే అవి సాకారం కాక మానవు.  
రోమ్‌ని ఒక రోజులో నిర్మించలేదన్నట్లుగా మన గమ్యాలు, కలలు ఒక్క రోజులో తీరేవి కావు. మన కలలకు ప్రతి రూపాలుగా మనం తీర్చిదిద్దే మన పిల్లలు పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావటానికి దాదాపు పాతికేళ్లు పడుతుంది కదా అందాక మనం శ్రమిస్తూనే ఉంటాం కదా! అలాగే మన ఇతర కలలు, గమ్యాలు కూడా. ఈ మధ్య నా గురువు గారు గీరా బెన్ శరభాయి గారిని కలుసుకున్నాను.
http://gujarattourism.net/gifs/baroda-museum.jpg
ప్రపంచం గర్వింపతగిన కేలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్ సృష్టికర్త ఆవిడ. ఒక జీవిత కాలం అవిరామ శ్రమకు ప్రతిరూపం ఆ మ్యూజియం. భారతీయ వస్త్ర సంపద 15 వ శతాబ్దం నుంచి నేటి దాకా కన్నులకు కట్టినట్లు కనబడుతుంది ఆ మ్యూజియంలో. అక్కడ నేను పనిచేయటం ఆ మ్యూజియంలో ప్రదర్శించిన వస్త్ర సంపదను విస్తృతపరిచే యజ్ఞంలో నేను సైతం రెండు మూడు చిరు సమిధలు వేశాను.

భారతీయ వస్త్ర సంపదను తిలకించాలంటే ఈ మ్యూ జియం కన్నా మెండైనది ప్రపంచంలో మరెక్కడా లేదు. వారిని కలుసుకున్నప్పుడు అన్నాను ఇంత గొప్ప మ్యూ జియం సృష్టించిన మీరు చరితార్ధులని. ఆవిడ జవాబు.. కల, గమ్యం స్పష్టంగా మన ముందుంటే పట్టుదల దానికి జోడిస్తే కాలమే మన కలలను సాకారం చేస్తుందని. నిజమే ఓర్పు ఉండాలి. కృషిని విడనాడకూడదు. మన కలలపై నమ్మకముండాలి. అశాంతితో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఓ పెద్దమనిషి ఒక గురువు గారి దగ్గరకు వెళ్లి మనశ్శాంతికి తనకేదైనా మంత్రోపదేశం చేయమన్నాట్ట అదీ చాలా సింపుల్‌గా! సూక్ష్మంలో మోక్షం కావాలి ఈ పెద్ద మనిషికి. ఆ గురువు గారు అతి చిన్న మంత్రాన్ని ఉపదేశించారు ఈయన గారికి.. అదేమంటే.. ఓ గాడ్ సేవ్ మీ. చాలా చిన్న మంత్రం కదూ. ఈ పెద్ద మనిషి అనుమానాల పుట్ట. అన్నీ అనుమానాలే. గురువు గారు చెప్పిన మంత్రాన్ని మార్చి ఇలా చెప్పుకున్నాడు. ఓ గాడ్ (ఇఫ్ యూ ఆర్ దేర్.. ఓ భగవంతుడా నీవంటూ అసలు ఉంటే) సేవ్ మీ (ఇఫ్ యూ కెన్ సేవ్ మీ.. నన్ను రక్షించగలిగితే రక్షించు). ఎంత నమ్మకం ! ఎంత గురి ! ఇటువంటి వ్యక్తిత్వమున్న వ్యక్తులను అంటే తన మీద గాని ఇతరుల మీద గాని నమ్మకం విశ్వాసం లేని వ్యక్తులు.. కలలేం కనగలరు ? వాటినెలా సాకారం చేసుకోగలరు ?? కల, కృషి, కాలం.. ఈ మూడు మనని మన గమ్యాల దాకా చేరుస్తాయి. వాటిని ఎట్టి పరిస్థితులలో మరిచిపోకూడదు, గమ్యాలను విడనాడకూడదు. రచయిత అంటే సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. అవి ఇతరులను ఇంప్రెస్ చేయటానికి కూడా పనికొస్తాయని, చిన్న చిన్న రచనలు చేయటం మొదలుబెట్టాను. ఎప్పటికైనా కాస్త పేరున్న రచయిత కావాలని బలమైన కల ఉండేది. 1964లో నా మొట్టమొదటి కథ... తానొకటి తలిస్తే.. ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అచ్చయింది. ఆ పైన అడపాదడపా కథలు, రేడియో నాటికలు రాస్తుండేవాణ్ణి. ఈ వ్యాపకంలోనే మహానుభావుడు ఉషశ్రీతో పరిచయమైంది 1967లో. న్యూ నల్లకుంటలో పక్కపక్క భాగాల్లో ఒకే ఇంట్లో ఉంటుండే వాళ్లం నా కుటుంబం, ఉషశ్రీ గారి కుటుంబం. రేడియో నాటకాల రచనకు ప్రోదల్భం, సూచనలు ఆయనే అందిచ్చారు. కొన్ని దశాబ్దాలైనా వారి జ్ఞాపకాలు మదిలో ఇంకా ఎంతో తాజాగానే ఉన్నాయి.

1967లో పెళ్లి. 1968లో అహ్మదాబాదుకి తరలి వెళ్లటంతో నా రచనా వ్యాసాంగం మరుగున పడిపోయింది. కొత్త ఊరు, కొత్త మనుషులు, మరీ కొత్త భాష, సంస్కృతి.. జీవన పోరాటంలో నిమగ్నుడినై పోయాను. అయితే నాలోని రచయిత నిద్రాణమై ఉన్నాడు తప్పితే పూర్తిగా నా నుంచి దూరం కాలేదు. రచయిత కావాలనే తృష్ణే పలు అంశాలపై వ్యాసాలు రాసేందుకు పురికొల్పింది. ఈ తృష్ణే ప్రకటనలను సృష్టించటం అందులో భాగంగా ప్రకటనలు రాస్తూ ఉండటం నా వృత్తిగా, నా వృత్తి ధర్మంగా మారిపోయింది అయితే అవన్నీ ఇంగ్లీషులో, తెలుగులో. 1968 తర్వాత ఏదైనా రాసిన జ్ఞాపకం లేదు. 2001లో ముద్రాకు నేనింకా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తుండగా, సడన్‌గా పుస్తక రచనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అమెరికన్ పబ్లిషింగ్ సంస్థ మెక్‌గ్రా హిల్ మేనేజింగ్ డైరెక్టర్ సింగపూర్ నుంచి అహ్మదాబాదు ఏదో పనిమీద వచ్చి నన్ను కలుసుకున్నాడు. నా ముద్రా అనుభవాల మీద ఒక పుస్తకం రాస్తే చాలా బాగుంటుందని, అది అడ్వర్‌టైజింగ్ రంగానికే కాకుండా, మేనేజమెంట్ రంగానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. ఆలోచిస్తానని మాటిచ్చి, జీవన పోరాటంలో మళ్లీ తలమునకలయ్యా.

2003లో నేను ముద్రాను విడిచి రిలయన్స్‌లో అడ్వైజర్‌గా చేరటం, నాకు రచనా వ్యాసాంగానికి సరిపడా టైమ్ లభ్యం కావటంతో దాదాపు 35 ఏళ్ల క్రితం నాలో నిద్రించిన రచయిత మేలుకొని మళ్లీ రచయితనయ్యాను. 2005లో నా మొదటి ఇంగ్లీషు పుస్తకం ది ఇన్‌విజిబుల్ సిఇఒ ప్రచురింపబడింది. కవర్ పేజీ మీద ఉన్న నా పేరును అలాగా ఎంత సేపు ఎన్నిసార్లు ఆనందంగా చూస్తూ ఉండిపోయానో ! కల నిజమాయెగా, కోరిక తీరెగా అని పాట పాడానో లేదో తెలియదు కాని, ఆనాటి నుంచి నేటి దాకా నా ప్రతి పుస్తకం ప్రతి వ్యాసం ప్రచురింపడిన రోజున అమితానందం కలుగుతుంది. రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నానేమో అనిపిస్తుంది. ఇష్టమైన పని చేస్తే వచ్చే తృప్తి ఆనందం ఈ రచనా వ్యాసాంగం ద్వారా నేను తెలుసుకున్నాను , అనుభవిస్తున్నాను. ఇంగ్లీషులో నిర్విరామంగా పక్షానికో వ్యాసం చొప్పున బిజినెస్ స్టాండర్డ్‌లో ఆరు సంవత్సరాల పాటు ఎజికె స్పీక్ అనే శీర్షిక కింద నా వ్యాసాలు అచ్చయ్యాయి. వాటి ద్వారా ఎందరో ప్రముఖులతో పరిచయమైంది ఎందరో నా అభిమానులుగా మారారు. ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం ఎజికె వారం వారం శీర్షికన 2005 నుంచి మూడేళ్లు 130కి పైగా వ్యాసాలు అచ్చయ్యాయి. తిరిగి గత 43 వారాలుగా ఈ జయహో వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. నేటి దాకా ఇంగ్లీషులో ఆరు పుస్తకాలు, తెలుగులో పది పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇంగ్లీషులోని నా పుస్తకాలు ధీరూభాయిజమ్, ఎగెనెస్ట్ ఆల్ ఆడ్స్, టెన్ మచ్ పలు దేశీయ భాషల్లో ప్రచురితమై అసాధారణ విజయాన్ని చవిచూసినాయి. గుజరాతీలో అయితే ధీరూభాయిజమ్ పుస్తకం ఆ భాషలోని ఆల్‌టైమ్ బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా చేరింది. ఇంగ్లీష్‌లో ఇదే పుస్తకం 2007 నుంచి నేటిదాకా పన్నెండు సార్లు ముద్రితమైంది. ఇదంతా సొంత డబ్బా కొట్టుకోవటం కాదు. బలమైన కల ఉంటే కాలమే దాన్ని సాకారం చేస్తుందనే నిజాన్ని మీ ముందు సోదాహరణంగా ఉంచటానికే.

35 ఏళ్లు రచనా వ్యాసాంగానికి దూరంగా ఉన్న నేను ఇంత ప్రాలిఫిక్ రైటర్.. అంటే ఎంతో విరివిగా రచనలు చేసే రచయితగా ఎలా మారానో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇట్టే అవగతమవుతుంది. బలమైన కల, గమ్యం, పట్టుదల అవే మనకు మార్గదర్శకాలవుతాయని. చిన్నప్పటి నా కల 45 ఏళ్ల తర్వాత నిజమైంది. అయితే ముందుగా ముచ్చటించుకొన్నట్లుగా కలలను విడనాడకూడదు. వీటిని మనస్సులోనే పెట్టి బంధించాలి. ఓర్పు పెంచుకోవాలి. రోమ్ మహానగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదనే సత్యాన్ని పదేపదే మననం చేసుకోవాలి. కల, కృషి, కాలం.. ఈ మూడు ఏకమై మన కలల్ని నేడు కాకపోతే రేపైనా సాకారం చేస్తాయనే ధృడమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోవాలి. మనసు మార్చుకోవద్దు. కలలను చంపుకోవద్దు. అర్థాంతరంగా జీవితాన్ని వివిధ మలుపులు తిప్పవద్దు. ఇష్టమైన దాని కోసం కష్టపడండి. మరోసారి ప్రయత్నించి చూడండి. ఇంకొంచెం, మరికొంచెం కాలం వేచి చూడండి. ఈ ప్రక్రియ వల్ల లాభమే కాని నష్టమంటూ ఏమీ జరగదు. ప్రసిద్ధ రచయిత పాల్ కోయిలో అన్నట్లు మీకే బలమైన కోరికుంటే ప్రపంచంలోని అన్ని శక్తులు కుట్రపన్ని కూడబలుక్కొని మీ కలను సాకారం చేస్తాయి. అక్షర సత్యం ఇది.
* ఎజి కృష్ణమూర్తి

Wednesday, June 1, 2011

ప్రపంచం మీ గుప్పిట్లో...

 http://www.prajasakti.com/images_designer/article_images/2011/4/24/aptn-1303669315342.jpg
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక సామాన్య రైతు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు. సమస్యల్లో ఉన్న ఇరుగుపొరుగు వారికి మంచి సలహాలిచ్చి ఆదుకుంటాడని మంచి పేరుంది ఈ పెద్ద మనిషికి. ఒక రోజు ఆ దేశ రాజు ఆ గ్రామం నుంచి వెళ్తూ.. మన రైతు గురించి, ఆయన మంచి గురించి, అతనిచ్చే సలహాల గురించి విని ఆయన్ను పిలిపించి అడిగాడు రోజూ నీ సంపాదన ఎంతా అని. ఒక రూపాయని చెప్పాడు.

రూపాయికి ఎంతో విలువున్న రోజులవి. ఆ రూపాయిని ఎలా ఖర్చు పెడ్తున్నావన్నాడు రాజు. ఒక పావలా తినేస్తాను, రెండో పావలా అప్పుగా ఇస్తాను. మూడో పావలాతో అప్పు తీరుస్తాను. నాలుగో పావలాని పారేస్తాను అన్నాడు ఆ రైతు. ఇదో పజిల్‌లాగా, మెదడుకు మేత వేసే సమస్యాపూరణం లాగా గోచరించింది రాజుకి. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పవయ్యా అన్నాడు రాజు. మొదటి పావలా నాకు నా భార్య తిండి ఖర్చులకు వినియోగిస్తాను. రెండో పావలా పెట్టుబడిగా నా పిల్లల మీద వెచ్చిస్తాను. రేపు నాకు నా భార్యకు వృద్ధాప్యంలో పిల్లలు తోడు నీడగా ఉంటారనే ఆశతో. మూడో పావలాతో నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాను. మిగిలిన నాలుగో పావలాను బీద వారికి దానం చేస్తానన్నాడు. సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి రాజుకి ఏకకాలంలో. ఈ పజిల్ జవాబుని వేరెవ్వరికీ చెప్పవద్దని, తన ముఖాన్ని వంద సార్లు చూసాకే ఎవరికైనా చెప్పాలని ఆజ్ఞాపించాడు రాజు. సరేనన్నాడు రైతు.

రాజధాని చేరిన రాజు రైతు జీవన శైలిని ఒక చిక్కు ప్రశ్నగా మార్చి దాన్ని విప్పమన్నాడు. ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఎవ్వరికీ సమాధానం దొరకలేదు. మంత్రి కనుగొన్నాడు రాజు ఒక గ్రామానికి వెళ్లటం. అక్కడో రైతుని కల్సుకోవటం. వెంటనే ఆ గ్రామం చేరుకొని మన రైతును కల్సుకొని ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాడు. రాజుకు మాటిచ్చాను. చెప్పలేనన్నాడు రైతు. వంద నాణాలు బహుమతిగా ఇచ్చి ఇప్పుడు చెప్పమన్నాడు మంత్రి. ఆ నాణాల మీద రాజు శిరస్సు ముద్రించి ఉంది. వంద నాణాలపై వంద రాజు ముఖాలు. ఇంకేం. ఎలాంటి సమస్యా లేదు అనుకుంటూ జవాబు చెప్పాడు రైతు మంత్రికి. హుటాహుటిన మంత్రి రాజధానికి తిరిగొచ్చి రాజుకు సమస్యాపూరణం చేశాడు. ఆశ్చర్యపోయిన రాజు మంత్రిని అడిగాడు సమాధానం ఎవరు చెప్పారని. నిజం తెల్సుకున్న రాజు ఆగ్రహావేశాలతో గ్రామం నుంచి రైతును రప్పించి నిప్పులు చెరిగాడు. శాంతంగా విన్న రైతు రాజా తమరే సెలవిచ్చారు కదా. తమరి వంద ముఖాలు చూసే దాకా ఎవ్వరికీ జవాబు చెప్పొద్దని. మంత్రి ఇచ్చిన వంద నాణాల మీద తమరి ముఖార విందాన్ని వంద సార్లు చూసాకే సమస్యని పూరించానని ఎంతో వినయ విధేయతతో చెప్పాడు.

రైతు రుజువర్తనుడే కాదు నమ్మదగ్గ వ్యక్తి. ఇచ్చిన మాటకు విలువిస్తాడు అని ఆగ్రహించి సన్మానించాడు. మనందరం ఆ రైతు లాగా జీవితంలోని ముఖ్యాంశాలను గ్రహిస్తే అడ్డదోవలు తొక్కుతూ ఈ సమాజాన్ని అల్లకల్లోలం చేయాల్సిన అవసరం ఉండదు కదా! వృద్దాప్యంలో తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించి వెట్టిచాకిరి చేయించుకునే ప్రబుద్ధులు ఎందరో! లేకుంటే చేతులు శుభ్రంగా డెటాల్‌తో కడుక్కొని తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి అంకితం చేయటం. ప్రేమతో గౌరవంగా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో ఆదరించే వారు భూతద్దంలో వెతికితే గాని కనబడదు. ఎంత దురదృష్టం. మాతృదేవోభవా, పితృదేవోభవా అనే సంస్కృతికి నిలయమైన మన భారతంలో ఎన్ని అపశృతులు. ఇతరుల సహాయం కోసమే మానవ జన్మ అని మన శాస్త్రాలు, పురాణాలు, పెద్దలు ఘోషిస్తుండగా.. పట్టపగలే బందిపోటు దొంగల్లా దేశాన్ని, మనల్ని దోచేస్తూ, దేశ సంపదను స్విస్ బ్యాంకులకు తరలిస్తున్నారు మనకు అండదండగా నిలవాల్సిన పెద్దమనుషులు. ధనార్జనకు అడ్డదారులేకాదు. రాజమార్గాలు ఉన్నాయని నిరూపించే ప్రయత్నమే ఈ నిజ జీవిత గాధలన్ని. పదండి ముందుకు ఈ చిన్న ప్రపంచం మన గుప్పిట్లోకి ఎలా వచ్చిందో తెల్సుకుందాం.
http://suryaa.com/Main/gallery/2010/Sep/07/world.jpg
ప్రపంచం మీ గుప్పిట్లో....
రిలయన్స్ మొబైల్ ఫోన్ ప్రకటనలకు ఇది ట్యాగ్‌లైన్.. నేను రాసిందే 2003లో. నిజంగా ప్రపంచం మన గుప్పిట్లోనే ఉంది కదూ నేడు. మా పని అమ్మాయికి ఆవిడ పతి దేవుడైన సెక్యూరిటీ గార్డుకి, మావంటావిడకు, ఆవిడ కుటుంబ సభ్యులందరికీ, మన పోస్టుమ్యాన్‌కు, మన డ్రైవర్లకి, మా మానవరాలికి, మీకు ... నాకు... ఎవ్వరికీ ఇది లేందే జరగదు ఒక్క క్షణం కూడా. సర్వాంతర్యామి మొబైల్. చిన్నా పెద్దా, రాజు పేద, ఆడామగా... ఎలాంటి తేడాలు చూపకుండా అందరికీ అండదండ గా నిలుస్తూ ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చింది ఈ మొబైల్ ఫోన్. చాలా వస్తు, సేవలు, విలాసాలు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఈ ప్రపంచంలో ఒక్క మొబైల్ ఫోన్ ఎలాంటి బేధాలు చూపకుండా అందరినీ అలరిస్తోంది. మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. ఒక్కోసారి మీకనిపించదూ ఈ మొబైల్ ఫోన్ లేకుండా ఇంతకాలం మనం ఎలా జీవిస్తూ వచ్చామా అని.

అరచేతిలో ఇమిడిపోయి ఎంతో సింపుల్‌గా ఇన్నోసెంట్‌గా కనబడే ఈ మొబైల్ ఫోన్ వెనక ఎన్నో సంవత్సరాల కృషి దాగి ఉంది. రెండు సంస్థలకు చెందిన ఇంజనీర్ల ద్వారా - మోటరోలా, ఎటి అండ్ టి - ఇది ఆవిష్కరించబడింది. ఈ రెండు సంస్థలు కమ్యూనికేషన్ రంగంలో ఉద్దండులే. మోటరోలా టూవే రేడియో టెక్నాలజీతో నిష్ణాతులు కాగా ఎటి అండ్ టి క్లిష్టమైన సెల్యులార్ టెక్నాలజీలో ప్రసిద్ధులు. ఈ రెండు సంస్థలు కలిసి చేసిన కృషికి ఫలితమే నేడు మన జేబుల్లో ఇమిడిపోయి మనతోనే ఎల్లవేళలా ఉండే మొబైల్ ఫోను. అసలు ఈ రెండు సంస్థలు మొదలుపెట్టింది కార్‌ఫోన్ రేంజిని పెంచుదామని. కార్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లకు చెందిన రేడియో ఫ్రీక్వెన్సీకి ముడిపడి ఉన్నాయి. ఈ ప్రీక్వెన్సీ రేంజ్‌ని డ్రైవర్ ఎక్కడకు వెళితే అక్కడదాకా పొడిగించాలంటే మరో కొత్త కమ్యూనికేషన్ పద్ధతిని కనుగొనాల్సి ఉంది.

అప్పట్లో వాడుకలో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమయ్యే పనికాదు. కొత్త టెక్నాలజీ కనుగొనటానికి ఎన్నో సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటగా ఒక కొత్త సెల్యులార్ సిస్టమ్‌ని కనుగొని దాని కోసమై ప్రభుత్వం క్లియరెన్స్‌లను పొందటం. రెండోది ఒక కొత్త ప్రొటోటైపు తయారు చేయటం. దీనికి సంబంధించిన నమూనాలు గాని, ఇతర సమాచారం గాని ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే పూర్తిగా ఇదొక వినూత్న ఆవిష్కారం. మోటరోలా ఇండస్ట్రియల్ డైరెక్టర్ రూడీ క్రాలాప్ ఈ పరిశోధనల గురించి వివరిస్తూ "మేం కనుగొంటున్న దాన్ని షూ ఫోన్'' అని పిలిచే వాళ్లం. ఎందుకంటే అది ఒక బూటులాగా రూపం సంతరించుకుంటోంది. చివరకు సెప్టెంబర్ 1, 1983న మోటరోలా సరికొత్త చరిత్రను సృష్టించింది. అమెరికాకు చెందిన యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, డివైఎన్ఎ టిఎసి 800ఎక్స్ ఫోన్‌ను అంగీకరించింది. ఈ ఫోన్ ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ మొబైల్ ఫోను. పదేళ్లు.. 10 కోట్ల డాలర్ల (450 కోట్ల రూపాయలు) పెట్టుబడికి ఫలితంగా ఉద్భవించిన మొబైల్ ఫోను ఇది.
http://www.travisfitzwater.com/wp-content/uploads/2010/02/dreambig.jpg
కార్ ఫోను రేంజ్‌ని పెంచుదామనుకొన్న చిన్న ప్రయత్నం ప్రపంచాన్ని, మనందరి గుప్పిట్లోకి తెచ్చింది. ఈ మొబైల్ ఫోను నేడు అందరికీ ఎలా కాసుల వర్షం కురిపిస్తోందో మనందరికీ తెలిసిందే. ఒక మంచి ఆలోచన, శ్రమ, దాని ఫలితం పది మందికి ఎలా ఉపయోగపడుతుందో, వారి జీవితాలను ప్రభావితం చేస్తుందో వివరించేదే ఈ మొబైల్ ఫోన్ కథ. అలాంటివే ఈ అధ్యాయం - పేరు ప్రతిష్టల ఫలితమే డబ్బు- లో మనం ముచ్చటించుకున్న ఇతర నిజ జీవిత కథలు కూడా. వాల్ట్ డిస్నీ యానిమేషన్ చరిత్ర, సింఫనీ కూలర్ విజయ గాధ, స్టార్ బక్స్ కాఫీ కప్పుతో ఘన విజయం, హాట్ మెయిల్ హాట్ హాట్ కీర్తి తద్వారా దక్కిన లక్ష్మీ కటాక్షం. యాపిల్ కంప్యూటర్ మెకింతోష్ ఆవిష్కరణ. అది సాధించిన అద్భుత విజయాలు. సోనీ వాక్‌మెన్ ఆవిష్కరణ. అది మన జీవిత సర ళిపై వేసిన చరగని ముద్ర. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్య బర్గర్, ఒక చిన్న ఐడియాతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన మెక్‌డొనార్డ్స్. ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం - మైక్రో చిప్ ద్వారా మానవజాతి జీవిత గమనాన్ని మార్చివేసిన కథాకమామిషు. చివరిగా ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చిన మొబైల్ ఫోన్ అద్భుత ఆవిష్కరణ. ఇవన్నీ ఇలాంటివి మరెన్నో... చిన్నా పెద్దా నిజ జీవిత గాధ లు.http://us.123rf.com/400wm/400/400/kjpargeter/kjpargeter0607/kjpargeter060700180/478803-the-world-in-your-hands--3d-render.jpg
వేలల్లో, లక్షల్లో .. మనకు చెప్పేది ఒక్కటే:
ప్రతిభకు ఫలితం పేరు ప్రతిష్టలు. వాటి ఫలితం డబ్బు. ధనార్జనకు రాచబాట ఇదే. మోసాలు, అన్యాయాలు, అరాచకాలు కాదు. అవి తెచ్చే సంపద కేవలం తాత్కాలికం. మోసపోయిన వారి తిట్లు, శాపనార్ధాలు, మనకు దీవెనలు కాదు కదా! ఆలోచించాల్సిన విషయం ఇది. సువిశాలమైన ఈ ప్రపంచంలో అందరికీ ఉన్నాయి అవకాశాలు. అవి అందిపుచ్చుకొని హాయిగా ఆనందంగా ఉండటమే మన కర్తవ్యం. 
http://drjeffadams.com/wp-content/uploads/2008/07/dream-big.jpg
కలలను, గమ్యాలను విడనాడొద్దు! కలతో, కృషితో నాస్తి దుర్భిక్షమ్!
- ఎజి కృష్ణమూర్తి

Sunday, May 22, 2011

'' మిస్టర్ రావును పిలవండి '' * ఆరుగురు ప్రధానుల మాట అది

శ్రీశ్రీ, వివేకానంద, చిన్మయానంద.. ఒకరు కమ్యూనిస్టు. మరొకరు తాత్వికుడు. ఇంకొకరు ఆధ్యాత్మికవేత్త. ఈ ముగ్గురి భావజాలం వేసిన బీజంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన న్యాయమూర్తి డాక్టర్ పి.సి.రావు (పాటిబండ్ల చంద్రశేఖరరావు). కృష్ణా జిల్లా వీరులపాడులో పుట్టి పెరిగిన ఆయన హ్యాంబర్గ్‌లోని 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ' కోర్టుకు జడ్జిగా పనిచేస్తున్నారు. దేశాల మధ్య తలెత్తే తగువుల్ని పరిష్కరించే తీర్పులిస్తున్నారు. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నవ్యతో మాట్లాడారు. "రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, దేవెగౌడతో కలిపి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది. కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా.. సలహాలు కావాలన్నా "మిస్టర్ రావును పిలవండి'' అనేవారు ప్రధానులంతా. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పీవీగారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు. రాజ్యాంగంలోని ప్రొవిజన్స్‌ను చాలా సందర్భాల్లో రాజీవ్‌కు వివరించేవాణ్ణి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ యాక్ట్‌లు తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం.''
"ఫిజీలో గొడవలు జరిగినపుడు రహస్యంగా వెళ్లి అక్కడున్న భారతీయులందరినీ కలిశాను. వాళ్ల అవసరాలు, కావాల్సిన హక్కుల గురించి తెలుసుకున్నాను. వాటన్నిటినీ క్రోడీకరించి.. ఆ దేశ ప్రభుత్వానికి మన డిమాండ్లను చెప్పాను. దాంతో కొత్త రాజ్యాంగ రచనలో మన వాళ్ల హక్కులకు స్థానం దొరికింది. కొత్త రాజ్యాంగాలు రాసుకుంటున్న అన్ని దేశాలకు వెళ్లాను నేను. అలా వెళ్లి ప్రవాస భారతీయుల హక్కులకు స్థానం కల్పించమని కోరాను. కొన్ని దేశాలకు ప్రభుత్వం పంపితే, మరి కొన్నింటికి ఆ దేశాల ఆహ్వానంపై వెళ్లాను. టిబెట్, సూడాన్, కరీబియన్ దేశాలకు ఇలాంటి పనిమీదే వెళ్లడం మరిచిపోలేని అనుభవం.''

"చూశారుగా ఈ మూలనున్న పెద్ద పార్శిల్ బాక్సులు. వాటిలో ఉన్న కాగితాలను క్షుణ్ణంగా చదవాలి. బోలెడు పుస్తకాలను రెఫర్ చేయాలి. అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి. ఎవరి వాదనలో ఎంత సత్యముందో అర్థం చేసుకోవాలి. ఇది మూడు దేశాలకు సంబంధించిన వ్యవహారం కదా.. హ్యాంబర్గ్ వెళుతూనే ఈ కేసు మీద తీర్పు చెప్పాలి..'' అంటూ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ఎదురుగ్గా ఉన్న భవంతిలో ఇంటర్వ్యూ మొదలుపెట్టారు డాక్టర్ పి.సి.రావు. ఇండియా, బంగ్లాదేశ్, బర్మా దేశాల సముద్ర జలాలకు సంబంధించిన కేసు అది. ఆ మూడు దేశాలు హ్యాంబర్గ్‌లోని 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ'లో విడివిగా కేసులు వేశాయి. ఆ కేసును విచారించే జడ్జిలలో ఒకరైన డాక్టర్ పి.సి.రావు.. మన దేశంలో ఆ స్థాయికి చేరుకున్న వారిలో నాలుగోవారు. ఇంటర్నేషనల్ కోర్టుకు చీఫ్ జస్టిస్ అయిన వారిలో ప్రథములు.

రెడ్‌విలేజ్...

"కృష్ణా జిల్లాలోనే మంచి చైతన్యవంతమైన గ్రామం మాది. వీరులపాడు పేరు చెప్పగానే ఎంతోమంది పెద్దవాళ్లు గుర్తుకొస్తారు. త్రిపురనేని రామస్వామి చౌదరి మా ఊర్లోనే పెళ్లి చేసుకున్నారు. ఆనాడే రైతుల కోసం ప్రత్యేకించి గ్రంథాలయం స్థాపించారు. ఊర్లో అందరూ కమ్యూనిస్టులే. అందుకే 'రెడ్ విలేజ్' అనేవారంతా దాన్ని. మా అమ్మ పుస్తకాలు బాగా చదివేది. లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి నన్ను కూడా చదవమనేది. అలా అలవాటైన పుస్తకాలను ఇప్పటికీ వదల్లేదు నేను. పెద్దయ్యాక బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లి చదివేవాణ్ణి. అప్పుడే శ్రీశ్రీ, చిన్మయానంద, వివేకానందల భావజాలం నన్ను ఉత్తేజపరిచింది. శ్రీశ్రీ పుస్తకాలతోనే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాను. ఉపనిషత్తుల్లోని గురు, శిష్య సంవాదం తార్కిక, లౌకిక జ్ఞానాన్ని పెంచింది. చెబితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, శ్రీశ్రీ, వివేకానంద, చిన్మయానంద ఆలోచనల్లోని టెక్నిక్‌ను... నా తీర్పుల్లో కూడా అనుసరిస్తాను. టెక్నిక్ అంటే 'నువ్వు ఎటువైపు చూస్తున్నావ్..? ప్రపంచాన్ని నువ్వు ఏ దృక్పథంతో పరిశీలిస్తున్నావ్? అన్నదే''

గోల్డ్‌మెడలిస్ట్...

"వందమందిలో కేవలం పదిమందే ఎం.ఎల్.లో పాసయ్యేవారు పాత రోజుల్లో 'లా' గోల్డ్‌మెడల్ వచ్చింది నాకు. ఆ తర్వాత మద్రాసు యూనివర్శిటీలో ఎల్.ఎల్.డి. (డాక్టర్ ఆఫ్ లాస్) చేశాను. ఆ కోర్సు చేసిన ఆఖరి వ్యక్తిని నేనే. ఎందుకంటే నాకు డాక్టరేట్ వచ్చాక ఆ కోర్సును ఎత్తివేశారు. చదువు గురించి చెబుతున్నాను కాబట్టి ఇక్కడో విషయం గుర్తుచేసుకోవాలి. నేను బీఏలో ఫిలాసఫీ తీసుకుంటుంటే ఒక అధ్యాపకుడు ఏమన్నాడంటే.. "ఏంటయ్యా, ఇది పనికొచ్చే కోర్సు కాదు. ఏదైనా ఉద్యోగం వచ్చే కోర్సులో జాయినవ్వు. టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటావ్..?'' అన్నారు కాస్త విసుగ్గా. "లేదు సార్, నా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఫిలాసఫీ చేశాక న్యాయశాస్త్రం చదువుతాను...'' అన్నాను. ఫిలాసఫీ అనేది ప్రశ్నల్ని లేవనెత్తే గొప్ప శాస్త్రం. ప్రశ్నలతోనే మనో వికాసం సాధ్యం. అలా ఇష్టంతో చదవడంతో 'బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్' అవార్డు దక్కింది నాకు. చదువు పూర్తయ్యాక న్యాయరంగంలోకి అడుగులు పడ్డాయి..''

ఒక్కో మెట్టు ఎక్కుతూ..

"నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 'ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా' నెలకొల్పారు. ఢిల్లీకి వెళ్లి అందులో 'రీసెర్చ్ ఆఫీసర్'గా జాయినవ్వడంతో నా కెరీర్ మొదలైంది. అదే సంస్థ నుంచి వచ్చే 'ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా' లో ఎడిటింగ్ వర్క్ కూడా చేసేవాణ్ణి. 1967లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 'లా ఆఫీసర్'గా పోస్టింగ్ రావడంతో జాయినయ్యాను. ఆ శాఖలో పలు పదవులు నిర్వర్తించాక.. కేంద్ర న్యాయ శాఖకు వెళ్లాను. అక్కడ డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి లా సెక్రటరీ వరకు పనిచేశాను. ఈ సమయంలో రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, దేవెగౌడతో కలిపి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది.

కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా.. సలహాలు కావాలన్నా "మిస్టర్ రావును పిలవండి'' అనేవారు ప్రధానులంతా. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పీవీగారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు. రాజ్యాంగంలోని ప్రొవిజన్స్‌ను చాలా సందర్భాల్లో రాజీవ్‌కు వివరించేవాణ్ణి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ యాక్ట్‌లు తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం. విధుల్లో భాగంగా అన్ని దేశాలు తిరిగాను. అక్కడి న్యాయవ్యవస్థలను అర్థం చేసుకున్నాను. నేను అంతర్జాతీయ న్యాయరంగంలోకి వెళితే మన దేశం ప్రతిష్ట పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం... ఇంటర్నేషనల్ కోర్టుకు ప్రపోజ్ చేసింది..''

ఎల్లలు దాటి...

"అంతర్జాతీయ న్యాయవ్యవస్థ ఒకప్పుడు చాలా సంక్లిష్టంగా ఉండేది. ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి తగువులు వచ్చినా ఈ కోర్టే పరిష్కరించాలి. కేసులు పెరిగిపోయి తీర్పుల్లో జాప్యం జరుగుతుండటంతో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని విడదీశారు. అవే మూడు అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టులు అయ్యాయి. అందులో ఒకటి 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ'. ఈ కోర్టు జర్మనీలోని హ్యాంబర్గ్‌లో ఉంది. దేశాల మధ్య ఎలాంటి జల వివాదాలు వచ్చినా ఈ కోర్టే విచారిస్తుంది. ఇందులో పలు దేశాలకు చెందిన 21 మంది జడ్జిలు ఉంటారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే అదో పెద్ద ప్రక్రియ.

ఆయా దేశాలలో లబ్దప్రతిష్టులైన ఒక న్యాయనిపుణున్ని స్వయంగా ప్రధానే సిఫారసు చేయాలి. ఆ వ్యక్తి వివరాలన్నీ ఆ దేశపు రాయబార కార్యాలయాలకు వెళతాయి. న్యూయార్క్‌లోని డిప్లమాటిక్ మిషన్స్ ప్రచారం చేస్తాయి. ఈ పని అన్ని దేశాలు చేస్తాయి. ఆఖర్న ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో దేశాలు సిఫారసు చేసిన న్యాయ నిపుణులు జడ్జిలుగా పోటీ చేస్తున్న వారికి ఓటు వేస్తారు. అప్పుడు గెలిచిన వారే సంబంధిత కోర్టుకు జడ్జి అవుతారు. కనీసం 106 దేశాలు ఓటు వేస్తేకానీ జడ్జి కాలేరు. ఎన్నికైన జడ్జిలు తిరిగి చీఫ్ జస్టిస్‌ను ఎన్నుకుంటారు. ఇంత తతంగం ఉంటుంది అంతర్జాతీయ కోర్టులకు జడ్జి కావాలంటే. ఇప్పటి వరకు మన దేశం తరఫున కేవలం ముగ్గురు మాత్రమే జడ్జిలు (బి.ఎన్.రావు, నాగేంద్రసింగ్, ఆర్.ఎస్.పాథక్) అయ్యారు. నాలుగో వ్యక్తిని నేను. హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకోవడంతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిపోతుంటాను.''

-మల్లెంపూటి ఆదినారాయణ ఫోటోలు : ఎం.గోపికృష్ణ

Wednesday, May 18, 2011

శృంగారానికి తొలి పాఠం!

'కామసూత్ర' ఈ పేరు వినగానే శృంగారం గుర్తుకొస్తుంది. 
నిజానికి రెండు వేల ఏళ్ల క్రితం రాసిన ఈ పుస్తకంలో శృంగారానికి సంబంధించిన అంశాలు మాత్రమే కాదు. స్త్రీ, పురుషులు ఒకరినొకరు ఎలా ఆకర్షించుకోవాలనే విషయాన్ని కూడా వాత్స్యాయనుడు చర్చిస్తాడు. ఇప్పటి దాకా ఈ పుస్తకాన్ని భిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ.. అందులో సారాన్ని వివరిస్తూ 183 పుస్తకాలు వెలువడ్డాయి. 
http://www.thehindu.com/multimedia/dynamic/00494/03ndmpSpring_fever__494512e.jpg
కొత్తగా ఈ పుస్తకంలోని సారాన్ని అందరికి అర్థమయ్యే రూపంలో - ఎ.ఎన్.డి. హక్సర్ సంస్కృతం నుంచి ఇంగ్లీషులోకి అనువదించారు. మొత్తం ఏడు అధ్యాయాలు ఉన్న ఈ పుస్తకంలో కేవలం శృంగార భంగిమల గురించే కాకుండా స్త్రీ,పురుష సంబంధాల గురించే కూడా చర్చించారు. దీనిలోని కొన్ని ముఖ్యమైన అంశాలు.....
http://images.bhaskar.com/web2images/www.dailybhaskar.com/2011/02/21/images/kama_sutra_250_f.jpg
"ఆరోగ్యకరమైన శృంగారానికి 64 కళల అవసరం కూడా ఉంటుంది. అందువల్ల దీనిని '64 సిద్ధాంతం' అని కూడా పిలుస్తారు. రుగ్వేదంలో ఉన్న శ్లోకాలను పదింటి చొప్పున గుదిగుచ్చుతారు. అదే విధంగా శృంగార కలయికలో ఉన్న అంశాలను 64గా కూరుస్తారని మనం భావించవచ్చు. భభృవ్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం- శృంగారంలో ప్రధానమైనవి ఎనిమిది అంశాలు.''
http://ww.spicezee.com/upload/2011/1/30/kamasutra-150.jpg
పురుషులు ఎలా తయారుకావాలి?
ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పళ్లను శుభ్రంగా తోముకోవాలి. ఆ తర్వాత సువాసన వెదజల్లే లేహ్యాన్ని వంటికి రాసుకోవాలి. సుగంధాన్ని వెదజల్లే సాంబ్రాణి పొగతో జుట్టును శుభ్రపరచుకోవాలి. తేనెటీగల మైనాన్ని, మృదువుగా ఉన్న ఎర్రని లక్కను మొహానికి రాసుకోవాలి. ఆ తర్వాత మంచి పూల దండ వేసుకొని రోజు వారీ కార్యక్రమాలకు ఉపక్రమించాలి.
http://www.newsreporter.in/wp-content/uploads/2011/05/Kama-Sutra-Wall-Carvings-Khajuraho-300x225.jpg
పురుషులు ప్రతి రోజూ స్నానం చేయాలి. రెండు రోజులకు ఒకసారి ఒళ్లు పట్టించుకోవాలి. మూడు రోజులకు ఒక సారి చేప ఎముకతో చేసిన పరికరంతో ఒళ్లును శుభ్రపరచుకోవాలి. మీసాలు, గోళ్లు నాలుగు రోజులకు ఒక సారి తీసుకోవాలి. శరీరంపై ఉన్న అనవసరపు రోమాలను ప్రతి పది రోజులకు ఒక సారి తీసివేయాలి.
http://www.indianetzone.com/photos_gallery/12/khajuraho_18221.jpg
ఆకర్షణీయంగా మారాలంటే...
"తయారయ్యే విధానం, వయస్సు, వ్యక్తిత్వం, స్వేచ్ఛగా ఉండే తత్వం- ఒక వ్యక్తిని ఆకర్షణీయంగా తయారుచేస్తాయి. దీని కోసం అధర్వణ వేదంలో కొన్ని మూలికలను పేర్కొన్నారు. వీటిని ఉపయోగించటం వల్ల వ్యక్తులు ఇతరులను ఆకర్షించగలుగుతారు. అడవుల్లో పెరిగే అల్లం, గడ్డి గులాబీలు, నేరేడు జాతికి చెందిన చెట్ల ఆకులను బాగా ఎండపెట్టాలి. ఎండిన ఈ మూడింటిని పొడిగా చేయాలి. మెలోబాలన్ (ఉత్తర భారతంలో వీటిని అర్జున చెట్లు అంటారు) చెట్ల నుంచి తీసిన నూనెను ఒక మానవ కపాలంలో పోయాలి. ఈ పొడిని పత్తితో కలిపి వత్తిగా చేసి వెలిగించాలి. అప్పుడు వచ్చే పొగ గదిలోని వ్యక్తులను ఆకర్షణీయంగా చేస్తుంది. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే- మరి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కొన్ని ఎర్ర కలువలను, నీలం కలువలను తీసుకోవాలి. వీటిని అడవి గులాబీల రేకలతో కలిపి ఎండపెట్టి

పొడిగా చేయాలి. ఈ పొడిని తేనె, నెయ్యిలతో కలిపి తీసుకుంటే వ్యక్తులు ఆకర్షణీయంగా తయారవుతారు. ఈ పొడినే నేరేడు ఆకులతో కలిపి లేహ్యంగా చేసి ఒంటికి రాసుకుంటే ఆకర్షణ వస్తుంది.
http://www.telugupedia.com/VatsayanaKamaSutra/Mukteswar_temple.jpg
ఈ మూలికలతో పాటు కొన్ని జంతువుల ఎముకలను ఉపయోగించటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. బంతిపువ్వుల రేకలను తీసుకొని వాటి నుంచి రసం తీయాలి. ఈ రసంలో ఒంటె ఎముకను నానపెట్టాలి. ఇలా నానపెట్టిన ఎముకను బాగా కాల్చాలి. అప్పుడు వచ్చే కాటుకను తీసుకొని కళ్లకు పెట్టుకుంటే అత్యంత ఆకర్షణీయంగా తయారవుతారు. గద్దలు, రాబందులు, నెమళ్ల ఎముకలను కూడా ఇదే విధంగా చేసి వచ్చిన కాటుకను పెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

లైంగిక శక్తి పెరగాలంటే..
లైంగిక శక్తి పెరగటానికి, భాగస్వామిని సంతృప్తిపరచటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అల్లం, మిరియాలు, అడవిలో దొరికే లైకోరైస్ అనే చెట్టు బెరడులను పొడి చేయాలి. ఈ పొడిని పాలలో కలుపుకు తాగాలి. గొర్రె వృషణాలను పాలలో వేసి, ఆ పాలను మరగపెట్టి తాగటం వల్ల లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. మాంసం తినని శాకాహారులకు మరొక పద్ధతి ఉంది. అడవిలో దొరికే కంద, చేమ, పెండలం వంటి దుంపమొక్కల వేర్లు , ఖర్జూరాలు, గుర్రం కళ్ల ఆకారంలో ఉండే బీన్స్‌లను పాలలో వేసి బాగా మరగించి తాగినా లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. ఒక వేళ ఈ వస్తువులు దొరకకపోతే- తోక మిరియాలు, చెరకు వేర్లు, పెండలం గుజ్జును పాలలో వేసి మరగించాలి. ఆ పాలను తాగటం వల్ల ప్రయోజనం లభిస్తుంది. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారి కోసం మరి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. పిచ్చుకల గుడ్లలో ఉండే సొనను సంపాదించాలి. ఈ సొనను నేతితోను, తేనెతోను కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బియ్యం కలిపి పాలలో ఉడికించాలి. దీనిని తినటం వల్ల పురుషులలో లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. అనేక మంది స్త్రీలను సంతృప్తి పరిచే సామర్థ్యం లభిస్తుంది.

శృంగార కలయిక..
రతిలో 64 భాగాలు ఉంటాయని చెబుతారు. కొందరు అయితే 64 భాగాలను విడి విడి అధ్యాయాలుగా గ్రంథస్థం చేసారు కూడా. ఆరోగ్యకరమైన శృంగారానికి 64 కళల అవసరం కూడా ఉంటుంది. అందువల్ల దీనిని '64 సిద్ధాంతం' అని కూడా పిలుస్తారు. రుగ్వేదంలో ఉన్న శ్లోకాలను పదింటి చొప్పున గుదిగుచ్చుతారు.
http://static.ibnlive.com/pix/sitepix/02_2011/kamasutra_book_630.jpg
అదే విధంగా శృంగార కలయికలో ఉన్న అంశాలను 64గా కూరుస్తారని మనం భావించవచ్చు. భభృవ్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం- శృంగారంలో ప్రధానమైనవి ఎనిమిది అంశాలు. కౌగిలింత, ముద్దు, కిలికించితం, కొరకటం, రతి, మూలుగు, ఉపరతి, ముఖరతి. ఈ ఎనిమిదింటిలోను మళ్లీ ఎనిమిది రకాలు ఉన్నాయి. ఎనిమిదిని ఎనిమిదితో హెచ్చువేస్తే 64 అవుతుంది కాబట్టి.. శృంగార కలయికను కూడా 64 కళలుగా పిలుస్తారు.

Tuesday, May 17, 2011

ఐడియాలతో అద్భుతాలు

'' పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బు ''  ఆ పద్ధతి రాచమార్గం కాగా కుయుక్తులతో, అన్యాయంతో, అక్రమాలతో దేశాన్ని కొల్లగొట్టడం, అక్రమార్జన చేయటం అడ్డదారులుగాను. నాలుగు కాలాలపాటు నిలిచేదిగాను కాదని  తెలుసుకున్నాం. పదండి ముందుకి.. మిగతా అందిరి లాగే మనం కూడా మొబైల్ సంగీతం ఆస్వాదిద్దాం. మొబైల్ సంగీతం... జేబులో మొబైల్, చెవిలో స్పీకర్ లేని వ్యక్తి నేడు మనకెక్కెడా తారసపడరు. నడుస్తూ, వాహనాలు నడుపుతూ, నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ, నిద్రపోతూ, చదువుకుంటూ, మాట్లాడుతూ సర్వవేళ సర్వావస్తలా ఈ మొబైల్ సంగీతం ఉండాల్సిందే... దాదాపు అందరికీ.. దీని పూర్వాపరాలు తెలుసుకుందాం.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOq4Sn_UmgdFYJQobMXVhW58urKO3fmE4miz5RPNkvqXJAjkc4hSWTR-O7b_VvQEqrV13tNMr3A-n65phQxCX_fpYXs1PbjX-w7JrIn8GLif1i0srWyFYHhLs6JMihwm0wlfLlgFSabjQ/s1600/Akio+Mirota.jpg
ఈ మొబైల్ సంగీత యుగం ఆరంభం కాకముందు ప్రయాణాలు ముఖ్యంగా గంటలతరబడి చేసేవి, చాలా కష్టతరంగా, బోరింగ్ గాను ఉండేవి. ఒక్కసారిగా ఊహించుకోండి. దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగా సాగే భారత్-అమెరికా విమాన యాత్రలో సీట్లకు అతుక్కుపోయి అలాగే ఉండిపోవటం ఎంత కష్టంగా ఉండేదో ! తనువు, మనసు రెండు కష్టపడేవి విసుగెత్తిపోయేవి. అలాంటి ఒక ప్రయాణంలో సోనీ కార్పొరేషన్ చైర్మన్ అకియో మోరిటా బ్రహ్మాండంగా బోర్ అయిపోయి ఒక సరికొత్త ఐడియాతో ప్లేన్ దిగాడు. ఆ ఐడియా మ్యూజిక్ పరిశ్రమను పూర్తిగా మార్చివేయటమే కాకుండా, మనం సంగీతం వినే పద్ధతులను కూడా గుర్తుపట్టలేనంతగా మార్చేసింది. ఆ సుదీర్ఘ విమానయానం తర్వాత జపాన్‌లోని తన ఆఫీసుకు వెళ్లిన మోరిటా తన బృందాన్ని పిలిచి అటువంటి సుదీర్ఘ విమానయానాల్లో మనం మనకిష్టమైన మ్యూజిక్ వింటుంటే ఎంత బాగుండునో కదా అని అన్నాడు. ఆ ఆలోచనే నేడు కొన్ని వేల కోట్ల విలువైన ' వెళ్తూ వినే సంగీతానికి '(మ్యూజిక్ ఆన్ ది మూవ్) నాంది పలికింది.http://www.conceivablytech.com/wp-content/uploads/2010/10/sony-walkman.jpg
ఈ ఆలోచనకు మొదటి ప్రత్యక్ష రూపమే సోనీ వాక్‌మెన్. యువతను సంపూర్ణంగా ఆకట్టుకొని వాక్‌మెన్ లేని జీవితం కూడా ఒక జీవితమేనా అనేలా చేసింది. వాక్‌మెన్ మన వెంట తీసుకెళ్లగలిగిన మొట్టమొదటి మ్యూజిక్ సిస్టమ్. ఈ సిస్టమ్ వృద్ధి చెంది స్టీరియో రికార్డింగ్ చేసుకునే సదుపాయాన్ని కలిగించింది. కంప్యూటర్ మ్యూజిక్, ఎంపి 3 వచ్చిందాకా ఏకచ్ఛత్రాధిపత్యంతో మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలింది వాక్‌మెన్. వాక్‌మెన్‌ను సృష్టించిన మోరిటాకు ఆ పేరంటే అస్సలు ఇష్టముండేది కాదు. వాక్‌మెన్ ఏమిటి అసహ్యంగా అనుకున్నాడు. పేరు మార్చుదామని ప్రయత్నిస్తే సలహాదారులు చాలా పాపులర్ అయిన పేరు వాక్‌మెన్ మార్చవద్దని సలహా ఇచ్చారు. వాక్‌మెన్ పేరు అలాగే ఉండిపోయింది.

ఒక చిన్న ఐడియా దూరాభారపు విమాన ప్రయాణాల్లో సొంత సంగీతం వినటం ఎలాగా అన్న ఆలోచన సంగీత ప్రపంచంలో సంచలనం కలిగించి, వేల కోట్ల వ్యాపారానికి మూలకారణమైంది. డబ్బు సంపాదించాలంటే ఐడియాలు కావాలి. అడ్డదార్లు కాదు మహాప్రభో !! వెళ్తూ ... తింటూ... తింటూ వెళ్తూ... రెండు బ్రెడ్ ముక్కలు.. వాటి మధ్య ఒక బర్గర్.. మరో చిన్న ఐడియా వేల కోట్ల వ్యాపారానికి, లాభాలకు నాంది పలికింది. అంతేకాదు నాగరిక జీవనానికి ఒక గుర్తుగా మారింది. అనగనగా ఒకప్పుడు కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఇద్దరు సోదరులు డిక్, మేక్ మెక్ డొనాల్డ్‌లకు ఒక ఆలోచన కలిగింది. ప్రయాణంలో ఉన్నప్పుడు సాధారణంగా రెండు భోజనాల మధ్య ఆకలవుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో ఏదో ఒక సామాన్యమైంది, సింపుల్‌గా ఉంటే చాలు. నక్షత్రాల హోటళ్ల విందులవసరం లేదు. వేడిగా, తాజాగా, రుచిగా, తొందరగా లభ్యమయ్యే ఆహారమైతే చాలు. కార్లోను, బస్సులోను ప్రయాణం చేస్తుంటే వాహనం దిగకుండా ఆ ఆహారం దొరికితే అది బోనస్ కింద లెక్క. అప్పుడు ఆ ఆహారం కోసం కస్టమర్లు పదేపదే వస్తారు... ఇదీ ఆ సోదరులు ఆలోచన.
http://www.index.hr/images2/McDWend1.jpg
బ్రహ్మాండమైన ఆలోచన ఈ ఆలోచనలోంచి ఉద్భవించిందే.. ప్రపంచంలోని అతి పెద్ద ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్. గ్రాండ్‌గా ఐదు నక్షత్రాల రెస్టారెంట్స్ కావివి.. సింపుల్‌గా, క్లీన్ గా, ఫాస్ట్‌గా మన ఆకలిని తీర్చే ఆహారం అమ్మే రెస్టారెంట్స్. మెక్‌డొనాల్డ్స్ కథ కూడా వాళ్లు అందించే ఆహారం లాగానే చాలా సింపుల్. ఈ అన్నదమ్ములతో చేయి కలిపాడు రేక్రాక్ అనే ఓ పెద్ద మనిషి. తర్వాత ఆయనే ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసి నేడు మనం చూస్తున్న మెక్‌డొనాల్డ్స్‌గా తీర్చిదిద్దాడు. మెక్‌డొనాల్డ్స్ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న రెస్టారెంట్ చైన్. ఎన్నో చోట్ల, ఎల్ల వేళలా ఒకే రకంగా ఉండే సామర్థ్యం, ఆహారం.. ఇవీ మెక్‌డొనాల్డ్స్ విజయానికి మూల కారణాలు. ప్రపంచంలోని ఏ భాగనున్నా, మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఒకే రూపంలో ఉంటాయి. వెంటనే క్షణంలో ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. లోపలికెళ్లగానే ఒక రకమైన ఫుడ్, అదే సామర్థ్యం అన్ని చోట్ల ఒకేలా.http://www.thegimcrackmiscellany.com/wp-content/uploads/2008/09/whopper.jpg

కొత్త దేశాల్లో, కొత్త మనుషులు మధ్య ఒంటరితనం కాకుండా మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్‌ను ఒక చిరపరిచితమైన స్నేహితుడిగా భావిస్తాం మనం. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్యలో ఓ బర్గర్... చిన్న ఐడియా... వేల కోట్లలో వ్యాపారం, లాభాలు. నేడు 119 దేశాల్లో 31 వేల పైచిలుకు మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రోజుకి 4 కోట్ల 7 లక్షల మంది పైనే కస్టమర్లు. ఇదండీ కథ.

ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం
http://gigaom.files.wordpress.com/2008/09/kilby1lg.jpg
కిల్బీ, నోయిస్ అనే ఇద్దరు సైంటిస్టులు మైక్రోచిప్‌ను కనుగొని ఒక కొత్త ప్రపంచానికి శ్రీకారం చుట్టారు. మనం నేడు నివసిస్తున్న ఈ అధునాతన ప్రపంచంలోని కొత్త ఆవిష్కరణలో కెల్లా ఎంతో ముఖ్యమైంది ఈ మైక్రోచిప్ ఆవిష్కరణ. ఈ ఇద్దరు సైంటిస్టులు వేర్వేరుగా దీన్ని కనుగొని కొన్నేళ్లు కీచులాడుకొని చివ్వరికి మైక్రో చిప్ ఆవిష్కరణ తమ సమిష్టి కృషిగా నిర్ధారించుకొన్నారు. మైక్రోచిప్ ఎంత చిన్నదంటే దాన్ని ఒక చిరు చీమ నెత్తినపెట్టుకొని మోసుకెళ్లగలదు. అటువంటి అతి సూక్ష్మమైన చిప్ మీద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని పొందుపరుస్తారు. ప్రతి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌కి సర్క్యూట్ ప్రాణంలాంటింది. ఆ ప్రాణం ఉంది ఈ చిన్న ఇసుక రేణువులో !! ఆశ్చర్యంగా ఉంది కదూ ! ఈ ప్రక్రియ ద్వారా ఒక గది నిండా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మన అరచేతిలో సులభంగా అమరే ఒక బుల్లి డివైస్‌లో కూర్చోపెట్టవచ్చు.

మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ అని అంటూ ఉంటామే. దీని అవతరణకి మూల కారణం ఈ సిలికాన్ మైక్రోచిప్ వల్లనే. ఈ చిప్‌ను దీని వాడకంతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అమ్మకాలు 2004లో 179 అమెరికన్ బిలియన్ డాలర్లని అంచనా. అంటే 8 లక్షల కోట్ల రూపాయలకు పైబడే. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆధారంగా అమ్ముడుబోతున్న ఎలక్ట్రానిక్ పరికరాల విలువ 1.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే 50 లక్షల కోట్ల రూపాయలను మించి. ఈ అంచనాలు టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ వారివి. ఇక్కడే కిల్బీ పనిచేశాడు. కిర్బీ కథనం ప్రకారం ఒక సమస్యను తొందరగా పరిష్కరించాలనే ప్రయత్నంలో ఉన్నాడతను.

ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని అతడు కనుగొని ఉండకపోతే, ఆయన కంపెనీ ఆయన్ను ఒక సమస్యాపూరితమైన పనిలోకి మార్చి ఉండేది. అది ఎలాగైనా తప్పించుకోవాలని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి సారించాడు. వేసవి కాలం సెలవులు కావటం వల్ల తను పనిచేసే టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో తన సహోద్యోగులందరూ సమ్మర్ హాలిడేస్ మీద వెళ్లారు. ఆయనొక్కడే ఉన్నాడు పనిలో. టిఆర్ రీడ్ అనే వ్యక్తి రాసిన పుస్తకం 'ది చిప్'లో ఇలా అంటాడు కిల్బీ.. నేను తొందరగా ఒక మంచి ఐడియాను కనుగొన లేకపోతే వేసవి సెలవుల తర్వాత నన్ను మైక్రో మాడ్యుల్ డిపార్ట్‌మెంట్‌లోకి మారుస్తారేమోననిపించింది. అది ఇష్టం లేదు కిల్బీకి .అందుకే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి కేంద్రీకరించాడు.
http://www.biographicon.com/images/Noyce_Robert.jpg
మరోపక్కన నోయిస్ తన పరిశోధనల ద్వారా మైక్రో చిప్‌ని తక్కువ ధరల్లో పెద్ద ఎత్తున (మాస్ మాన్యుఫ్యాక్చర్) తయారు చేసే పద్దతిని కనుగొన్నాడు. అంతేకాదు ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్ సంస్థలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తుండగా చిప్‌ని కనుగొన్నాడు. కాలిఫోర్నియాలోని సిలికాన్ నేవీలో ఉన్న మొట్టమొదటి విజయవంతమైన సిలికాన్ సంస్థ ఈ ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్. వాళ్ల ప్రేరణలు ఎటువంటివైనప్పటికీ ఈ ఇద్దరు సైంటిస్టులు.. కిల్బీ, నోయిస్ మనందరి జీవిత విధానాన్ని మార్చివేసిన మైక్రోచిప్‌ని కనుగొన్నారు. ప్రతి ఆవిష్కరణకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కటి మటుకు ఉండదు.. డబ్బు.. ఒక ఆవిష్కరణ ఫలించటం ద్వారా దాని ఉప ఉత్పాదనగా, బై ప్రొడక్టుగా ప్రతిఫలంగా డబ్బు వస్తుంది తప్పితే కేవలం డబ్బు కోసం నూతన విధానాల ఆవిష్కరణ ఎక్కడా జరగలేదు. ఎవ్వరూ చేయలేదు.
- ఎజి కృష్ణమూర్తి